తదుపరి వార్తా కథనం

Hyderabad Metro: గణేశ్ నిమజ్జనంవేళ..హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం.. అర్ధరాత్రి ఒంటి గంట వరకు ట్రైన్స్
వ్రాసిన వారు
Sirish Praharaju
Sep 05, 2025
02:05 pm
ఈ వార్తాకథనం ఏంటి
గణేశ్ నిమజ్జన వేడుకల సందర్భంగా ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేందుకు హైదరాబాద్ మెట్రో ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. రేపు (శనివారం) ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు అన్ని మెట్రో స్టేషన్ల నుంచి రైలు సర్వీసులు అందుబాటులో ఉంటాయని అధికారులు ప్రకటించారు. ఈ నిర్ణయంతో నిమజ్జన ఉత్సవాలను వీక్షించేందుకు నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రజలకు సౌలభ్యం కలగనుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో సర్వీసులు
నిమజ్జనం సందర్భంగా రేపు మెట్రో టైమింగ్స్ పొడిగింపు
— Telugu Scribe (@TeluguScribe) September 5, 2025
తొలి ట్రైన్ రేపు ఉదయం 6 గంటలకు, చివరి ట్రైన్ అర్ధరాత్రి ఒంటి గంటకు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి బయలుదేరుతాయని తెలిపిన హైదరాబాద్ మెట్రో pic.twitter.com/sJrSiHoUFM