NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Hyderabad: చారిత్రక హుస్సేన్‌సాగర్‌ చుట్టూ సరికొత్త అందాలు.. స్కైవాక్, సైకిల్‌ట్రాక్‌  
    తదుపరి వార్తా కథనం
    Hyderabad: చారిత్రక హుస్సేన్‌సాగర్‌ చుట్టూ సరికొత్త అందాలు.. స్కైవాక్, సైకిల్‌ట్రాక్‌  

    Hyderabad: చారిత్రక హుస్సేన్‌సాగర్‌ చుట్టూ సరికొత్త అందాలు.. స్కైవాక్, సైకిల్‌ట్రాక్‌  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 08, 2025
    10:55 am

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్ నగరంలోని హుస్సేన్‌సాగర్ సరస్సు పరిసర ప్రాంతాలలో ఉన్న ముఖ్యమైన పర్యాటక స్థానాలైన నెక్లెస్‌రోడ్డు, సంజీవయ్యపార్కు, లుంబినీపార్కు, ఎన్టీఆర్‌గార్డెన్, ట్యాంక్‌బండ్ ఈ ప్రాంతాలు పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి.

    వారాంతాల్లో, ఇతర సెలవుల్లో వేల సంఖ్యలో సందర్శకులు ఈ ప్రదేశాలను సందర్శిస్తుంటారు.

    ముఖ్యంగా వారాంతాలలో సందర్శకుల సంఖ్య లక్షకు పైగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడానికి హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఒక ప్రణాళికను సిద్ధం చేసింది.

    వివరాలు 

    సాగర్ చుట్టూ స్కైవాక్‌ నిర్మించాలని ప్రణాళిక

    హుస్సేన్‌సాగర్‌కు చేరుకోవడాన్ని మరింత సౌకర్యవంతం చేయడానికి మెట్రో, ఎంఎంటీఎస్‌ నుంచి సాగర్‌ చుట్టూ స్కైవాక్‌ నిర్మించాలనేది ప్రణాళిక.

    మెట్రో ప్రయాణికులు ఖైరతాబాద్‌ స్టేషన్‌లో దిగి అక్కడి నుంచి నడిచి ఐమాక్స్‌ మీదుగా హుస్సేన్‌సాగర్‌ వద్దకు చేరుకుంటారు.

    అలాగే, ఎంఎంటీఎస్ ప్రయాణికులు కూడా ఖైరతాబాద్‌ స్టేషన్‌ నుండి రాకపోకలు నిర్వహిస్తుంటారు.

    ఈ నేపథ్యంలో, మెట్రో, ఎంఎంటీఎస్‌ అనుసంధానం ఆధారంగా... ఐమాక్స్‌ మీదుగా నెక్లెస్‌రోడ్డు, ఎన్టీఆర్‌ పార్కు ప్రాంతాలను సంస్కరించి, సాగర్ చుట్టూ స్కైవాక్‌ నిర్మించాలని ప్రణాళిక ఉంది.

    వివరాలు 

    10 కిలోమీటర్ల పైనే స్కైవాక్‌ 

    మొత్తం 10 కిలోమీటర్ల పైనే స్కైవాక్‌ ఉండనుంది. రోడ్డు పక్కన అవసరమైన స్థలాల్లో స్తంభాలు ఏర్పాటు చేసి, వాటిపై 6 మీటర్ల వెడల్పుతో స్కైవాక్‌ను నిర్మించనున్నారు.

    ఇందులో ఒక భాగం సైకిల్‌ ట్రాక్‌ కోసం, మరో భాగం నడిచే మార్గం కోసం కేటాయించబడుతుంది.

    ఖైరతాబాద్ మెట్రో, ఎంఎంటీఎస్‌ ప్రయాణికులు, అలాగే పీపుల్స్‌ప్లాజా, జలవిహార్, సంజీవయ్యపార్కు, లుంబినీపార్కు, ఇందిరాపార్కు, ఎన్టీఆర్‌గార్డెన్ ప్రాంతాల్లోకి ప్రవేశం, నిష్క్రమణ మార్గాలు ఏర్పాటు చేయబడతాయి. ఈ ప్రదేశాల్లో లిఫ్టులు కూడా ఏర్పాటు చేయనున్నారు.

    వివరాలు 

    ఈ ప్రాజెక్టు కోసం రూ. 500 కోట్లు ఖర్చు

    ఈ ప్రాంతాలలో పలు ఫుడ్‌కోర్టులు, ఓపెన్‌ థియేటర్లు, గేమింగ్‌ జోన్లు, మినీ థియేటర్లు వంటి అనేక వినోద అవకాశాలు కూడా అందుబాటులో ఉంటాయి.

    ఒకసారి స్కైవాక్‌లో ప్రవేశించిన తర్వాత పది కిలోమీటర్ల మేర నడుస్తూ హుస్సేన్‌సాగర్‌ అందాలను వీక్షించవచ్చు.

    ఈ మార్గం సైక్లింగ్, ఉదయపు నడక కోసం కూడా ఉపయోగపడుతుంది. పర్యాటకుల నుండి కొంత టికెట్‌ వసూలు చేయడం, అలాగే వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేయడం కూడా ప్రణాళికలో ఉంది.

    మొత్తం ఈ ప్రాజెక్టు కోసం రూ. 500 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    హైదరాబాద్

    NVS Reddy:హైదరాబాద్‌ మెట్రో రైలు తెలంగాణకు గర్వకారణం : ఎన్వీఎస్‌ రెడ్డి మెట్రో రైలు
    Hyderabad Master Plan: హైదరాబాద్‌ 2050-మాస్టర్‌ప్లాన్‌.. వివరాలను వెల్లడించిన సీఎం కార్యాలయం భారతదేశం
    Increased Cold: తెలుగు రాష్ట్రాల్లో అధికమవుతున్న చలి.. 15 డిగ్రీలకు దిగజారిన ఉష్ణోగ్రతలు చలికాలం
    Hyderabad Metro: మెట్రో రెండోదశలో ఐదు కారిడార్లు.. 54 స్టేషన్లు.. 7.96 లక్షల మంది రాకపోకలు  మెట్రో రైలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025