Page Loader
Omar Abdullah: ఇంకా మౌనంగా ఉండలేను.. దిల్లీ ఎయిర్‌పోర్ట్‌పై ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం
ఇంకా మౌనంగా ఉండలేను.. దిల్లీ ఎయిర్‌పోర్ట్‌పై ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం

Omar Abdullah: ఇంకా మౌనంగా ఉండలేను.. దిల్లీ ఎయిర్‌పోర్ట్‌పై ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 20, 2025
10:36 am

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శనివారం రాత్రి దిల్లీ విమానాశ్రయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ప్రయాణిస్తున్న ఇండిగో (IndiGo) విమానాన్ని అర్ధరాత్రి జైపుర్‌కు మళ్లించడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. జమ్మూ నుంచి దిల్లీకి బయలుదేరిన విమానం మూడు గంటల అనంతరం అకస్మాత్తుగా జైపుర్‌కు మళ్లించారని తెలిపారు. ఇందుకు సంబంధించి దిల్లీ విమానాశ్రయ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంపై ఒమర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రయాణికుల పట్ల ఇలా అలసత్వంగా వ్యవహరించటం ఏంటి? ఎప్పుడు ఎక్కడికి వెళ్తామో తెలియని పరిస్థితిలో ఉన్నాం. నేనూ ఇక మర్యాదగా మాట్లాడే స్థితిలో లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Details

ప్రతికూల వాతావరణం వల్ల విమానాల రద్దు

ఇదే సమయంలో, శనివారం శ్రీనగర్‌ విమానాశ్రయంలో మొత్తం ఆరు విమానాలు రద్దయ్యాయని అధికారులు తెలిపారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీని ప్రభావం ఇతర కనెక్టింగ్‌ విమానాలపై కూడా పడిందని అధికారులు పేర్కొన్నారు. ఇండిగో స్పందన ఈ అంశంపై ఇండిగో ఎయిర్‌లైన్స్ స్పందిస్తూ, జమ్మూలో తీవ్రమైన వర్షాలు, వడగళ్ల కారణంగా అనివార్యంగా ఈ మార్పులు చేయాల్సి వచ్చింది. మా బృందాలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. వాతావరణం మెరుగైన వెంటనే కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తాయని పేర్కొంది.