NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Cancellation of visa: ఇక్కడే ఓటేశాను.. నన్నెందుకు పంపిస్తున్నారు..? వీసా రద్దుతో పాక్‌ యువకుడి వేదన! 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Cancellation of visa: ఇక్కడే ఓటేశాను.. నన్నెందుకు పంపిస్తున్నారు..? వీసా రద్దుతో పాక్‌ యువకుడి వేదన! 
    ఇక్కడే ఓటేశాను.. నన్నెందుకు పంపిస్తున్నారు..? వీసా రద్దుతో పాక్‌ యువకుడి వేదన!

    Cancellation of visa: ఇక్కడే ఓటేశాను.. నన్నెందుకు పంపిస్తున్నారు..? వీసా రద్దుతో పాక్‌ యువకుడి వేదన! 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 30, 2025
    03:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గామ్‌ ఉగ్రదాడి అనంతరం భారత్‌ పాక్‌ పౌరుల వీసాల్ని రద్దు చేయడంతో, ఓ పాకిస్తానీ యువకుడు భారత్‌ విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది.

    ఈ నేపథ్యంలో తనకు భారతీయ పౌరుడిగా ఎన్నో హక్కులు ఉన్నాయని, ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నానని చెబుతూ ఆ యువకుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

    ఆయన తన పేరును ఒసామాగా పరిచయం చేసుకున్నాడు. నేను 17 ఏళ్లుగా ఇక్కడే ఉన్నాను. స్కూల్‌ చదువు ఇక్కడే పూర్తిచేశాను. ప్రస్తుతం డిగ్రీ చేస్తున్నాను. ఓటు హక్కు వినియోగించుకున్నాను.

    నాతో పాటు నా కుటుంబానికి రేషన్‌ కార్డు ఉంది. అలాంటప్పుడు నన్నెందుకు పాకిస్థాన్‌ పంపుతున్నారు? అక్కడ నాకు భవిష్యత్తే లేదు" అంటూ వాపోయాడు.

    Details

    వలస దారుల హక్కులపై ప్రశ్నలు

    వీడియో వైరల్‌ కావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ మొదలైంది. ఓ పాకిస్తానీ పౌరుడు ఎలా ఓటు హక్కును వినియోగించుకున్నాడు? అతడికి ఎలా రేషన్‌ కార్డు జారీ అయ్యింది? అనే ప్రశ్నలు ఊపందుకున్నాయి.

    ఇది ఎన్నికల భద్రతపై, దేశంలో అక్రమంగా నివసిస్తున్న వలసదారుల హక్కులపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

    Details

    భారత్‌-పాక్‌ సంబంధాలపై ప్రభావం 

    ఏప్రిల్‌ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌ బైసారన్‌ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందారు. ఈ దాడికి పాక్‌ ఆధారిత ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన 'ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ (TRF) బాధ్యత వహించింది.

    అయితే ఏప్రిల్‌ 26న TRF ఆ ప్రకటనను ఉపసంహరించుకుని తమ సోషల్ మీడియా అకౌంట్‌ హ్యాక్‌ అయిందని చెప్పింది. దీంతో భారత ప్రభుత్వం ఉగ్రవాదులపై భారీ ఆపరేషన్‌ ప్రారంభించింది.

    దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదుల్లో ఇద్దరు పాకిస్థాన్‌కు చెందినవారు కాగా, మూడో వ్యక్తి కాశ్మీర్‌లోని అనంతనాగ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

    ఆయన నివాసంతో పాటు మరికొంతమంది ఉగ్రవాదుల ఇళ్లను భద్రతా దళాలు కూల్చివేశాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    భారతదేశం

    Tariff Cuts: భారత్‌-అమెరికా వాణిజ్య వివాదం.. సుంకాల తగ్గింపుపై కేంద్రం కీలక ప్రకటన అమెరికా
    Rabies Deaths: భారతదేశంలో రేబిస్ మరణాలు 2.5 రెట్లు పెరుగుదల.. ప్రతి నెలా నలుగురు మృతి ప్రపంచ ఆరోగ్య సంస్థ
    #NewsBytesExplainer: అమెరికాకు ఆర్థిక మాంద్యం ముప్పు.. భారత్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఎంతంటే?  అమెరికా
    Bill Gates: భారత్‌పై బిల్‌గేట్స్ మరోసారి ప్రశంసలు.. మూడేళ్లలో మూడోసారి పర్యటన బిల్ గేట్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025