NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhra Pradesh: క్వాంటం వ్యాలీగా అమరావతి.. ఐబీఎం, టీసీఎస్ , ఎల్ అండ్ టీలతో ఒప్పందం !
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Andhra Pradesh: క్వాంటం వ్యాలీగా అమరావతి.. ఐబీఎం, టీసీఎస్ , ఎల్ అండ్ టీలతో ఒప్పందం !
    క్వాంటం వ్యాలీగా అమరావతి.. ఐబీఎం, టీసీఎస్ , ఎల్ అండ్ టీలతో ఒప్పందం !

    Andhra Pradesh: క్వాంటం వ్యాలీగా అమరావతి.. ఐబీఎం, టీసీఎస్ , ఎల్ అండ్ టీలతో ఒప్పందం !

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 02, 2025
    04:14 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో క్వాంటం కంప్యూటింగ్ రంగంలో ముందువరుసలో నిలిపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నారు.

    ఈ దిశగా వచ్చే సంవత్సరం జనవరి 1వ తేదీన అమరావతిని క్వాంటం కంప్యూటింగ్‌కు కేంద్రంగా అభివృద్ధి చేసి, సంబంధిత కార్యకలాపాలను ప్రారంభించాలని ఆయన నిర్ణయించారు.

    ఈ ప్రకటన అనంతరం శుక్రవారం నాడు సీఎం నివాసం ఉండవల్లిలో ప్రముఖ సంస్థలు ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), లార్సన్ & టూబ్రో (L&T)లతో రాష్ట్ర ప్రభుత్వం సహకార ఒప్పందాలు (ఎంవోయూలు) చేసుకుంది.

    వివరాలు 

    చారిత్రాత్మక ముందడుగు: చంద్రబాబు 

    ఈ ఒప్పందాల ఫలితంగా అమరావతిలో దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక 'క్వాంటం వ్యాలీ టెక్ పార్క్' నిర్మాణం జరగనుంది.

    అంతేకాకుండా, ఐబీఎం దేశంలోనే అతిపెద్ద 156 క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్ కలిగిన 'క్వాంటం సిస్టం 2' కంప్యూటర్‌ను అమరావతిలో ఏర్పాటు చేయనుంది.

    ఇది దేశవ్యాప్తంగా మొదటిసారిగా అమలవుతున్న ప్రాజెక్టు.

    ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు,1990లలో దేశంలో ఐటీ విప్లవానికి ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యత కలిగిన పాత్ర పోషించిందని గుర్తుచేశారు.

    ఇప్పుడు క్వాంటం విప్లవానికి కూడా రాష్ట్రం మార్గదర్శకంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

    ఐబీఎం,టీసీఎస్,ఎల్ అండ్ టీ సంస్థలతో కుదిరిన ఒప్పందం కేవలం రాష్ట్రానికే కాదు,దేశానికి కూడా చారిత్రాత్మకంగా నిలుస్తుందన్నారు. క్వాంటం కంప్యూటింగ్ అనేది భవిష్యత్తులో పాలన, ఆవిష్కరణలకు బలమైన బునియాదిగా మారుతుందని స్పష్టంచేశారు.

    వివరాలు 

    కేవలం 15 నెలల్లో హైటెక్ సిటీ

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్వాంటం టెక్నాలజీ వంటి కొత్త శాస్త్రవిజ్ఞాన అవకాశాలను ముందుగా గ్రహించి వాటిని వినియోగించుకోవడం అత్యవసరమని చెప్పారు.

    కాబట్టి భవిష్యత్తు అవసరాలన్నీ క్వాంటం కంప్యూటింగ్‌పైనే ఆధారపడతాయని,అందుకే అమరావతిని సిలికాన్ వ్యాలీ తరహాలో 'క్వాంటం వ్యాలీ'గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు.

    ఈ సందర్భంగా ఆయా సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు.

    హైటెక్ సిటీని కేవలం 15 నెలల్లో నిర్మించిన అనుభవాన్ని ప్రస్తావిస్తూ, క్వాంటం వ్యాలీ నిర్మాణాన్ని కూడా అతి తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

    ఇప్పటికే ఎల్ అండ్ టీకి స్థలాన్ని కేటాయించామని, అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధిని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

    వివరాలు 

    క్వాంటం ప్రయాణానికి ఆంధ్రప్రదేశ్ మైలురాయి 

    అలాగే ఈ ప్రాజెక్టు కోసం రెండు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

    ఒక కమిటీ నిర్మాణ పురోగతిని సమీక్షిస్తే,మరొకటి వ్యవస్థల అభివృద్ధిపై దృష్టి పెడుతుందని వివరించారు.

    ఈ ప్రాజెక్టును త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరంగా తెలియజేయనున్నట్టు చెప్పారు.

    ఈ సందర్భంగా ఐబీఎం క్వాంటం వైస్ ప్రెసిడెంట్ జే గాంబెట్టా మాట్లాడుతూ,భారత్‌లో ఐబీఎం క్వాంటం సిస్టం 2 ఏర్పాటు దేశ క్వాంటం ప్రయాణంలో ఒక కీలక మలుపుగా మారనుందని అన్నారు.

    టీసీఎస్‌తో కలిసి పనిచేయడం వల్ల క్వాంటం అల్గోరిథంల అభివృద్ధి మరింత వేగంగా సాగుతుందని చెప్పారు.

    టీసీఎస్ సీటీవో డాక్టర్ హారిక్ విన్ మాట్లాడుతూ,క్వాంటం,క్లాసికల్ కంప్యూటింగ్‌లను కలిపిన హైబ్రిడ్ మోడల్ ద్వారా జీవశాస్త్రం,మెటీరియల్స్,క్రిప్టోగ్రఫీ వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు సాధ్యమవుతాయని అన్నారు.

    వివరాలు 

    COIN నెట్‌వర్క్ ద్వారా 17 రాష్ట్రాల్లో.. 43 కేంద్రాలకు ప్రత్యక్షంగా లాభాలు

    టీసీఎస్ ప్రతినిధులు వి. రాజన్న,సీవీ శ్రీధర్ మాట్లాడుతూ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో తొలిసారిగా డిజిటల్ గవర్నెన్స్‌కు బీజం వేసిన సంస్థగా టీసీఎస్ నిలిచిందని గుర్తుచేశారు.

    కొత్తగా ఏర్పడనున్న క్వాంటం వ్యాలీ ద్వారా పరిశోధన,అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని చెప్పారు.

    COIN నెట్‌వర్క్ ద్వారా 17 రాష్ట్రాల్లో ఉన్న 43 కేంద్రాలకు ప్రత్యక్షంగా లాభాలు చేకూరుతాయని వివరించారు.

    అంతేగాక, క్వాంటం కంప్యూటింగ్‌ను 'రెండో క్వాంటం విప్లవం'గా పేర్కొంటూ, ఇది ఈవీ బ్యాటరీల నుంచి ఆర్థిక వ్యవస్థ వరకూ విస్తృత ప్రయోజనాలు కలిగించనుందని ఐబీఎం వైస్ ప్రెసిడెంట్ స్కాట్ క్రౌడర్ చెప్పారు.

    వివరాలు 

    భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించనున్న రాష్ట్రం 

    తాజా ఒప్పందాల ద్వారా అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు బలమైన ప్రథమ అడుగు పడిందని, ఈ ద్వారా రాష్ట్రాన్ని క్వాంటం పరిశోధనల జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు.

    దీని ద్వారా భారీ స్థాయిలో పెట్టుబడులను రాష్ట్రం ఆకర్షించనుందని చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం ఐపీఎల్
    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌

    ఆంధ్రప్రదేశ్

    AP SSC Result 2025: పదో తరగతి ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌..   భారతదేశం
    Trains Cancel : గుంతకల్ డివిజన్‌లో యార్డ్ రీ మోడలింగ్.. 40కి పైగా రైళ్లు రద్దు తిరుపతి
    Andhra Pradesh: ఏపీకి భారీగా పెట్టుబడులు.. శ్రీసిటీలో ఎల్‌జీ మెగా ప్లాంట్! నెల్లూరు నగరం
    AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్‌ సమావేశం.. భేటీలో పలు కీలక నిర్ణయాలు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025