NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Arvind Kejriwal: బీజేపీ గెలిస్తే ఢిల్లీలో అన్ని సేవలు ఆగిపోతాయి.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
    తదుపరి వార్తా కథనం
    Arvind Kejriwal: బీజేపీ గెలిస్తే ఢిల్లీలో అన్ని సేవలు ఆగిపోతాయి.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
    బీజేపీ గెలిస్తే ఢిల్లీలో అన్ని సేవలు ఆగిపోతాయి.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

    Arvind Kejriwal: బీజేపీ గెలిస్తే ఢిల్లీలో అన్ని సేవలు ఆగిపోతాయి.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 01, 2025
    02:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దేశ రాజధానిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా బీజేపీ, ఆప్‌ మధ్య తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి.

    ఇప్పటికే యమునా నది నీటి విషయంలో రెండు పార్టీల నేతలు వాదనలు కూడా సంచలనంగా మారింది.

    ఈ నేపథ్యంలో ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

    అరవింద్‌ కేజ్రీవాల్‌ ఓ వీడియో విడుదల చేసి, దిల్లీ ఎన్నికల్లో ఆప్‌ ఓడిపోతే, ఉచిత కరెంటు, నీరు, నాణ్యమైన విద్య, ఆరోగ్య సేవలు అందించడం ఆగిపోతుందని స్పష్టం చేశారు.

    అలాగే బీజేపీ వీటన్నింటిని ఆపేస్తుందని, ఇంకా నెలకు రూ.25 వేల ఖర్చు పెరుగుతుందన్నారు.

    Details

    ఫిబ్రవరి 8న ఫలితాలు

    బీజేపీ పాలనలో ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉంటాయో, 24 గంటల కరెంటు ఉందా, లేదో చూడాలని ఆయన అన్నారు.

    కేజ్రీవాల్‌ బీజేపీ ప్రయోజనాల గురించి కాకుండా ప్రజల కుటుంబాల గురించి ఆలోచన చేయాలని సూచించారు.

    ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో కొత్త చర్చకు దారి తీశాయి. కొద్దిరోజులుగా యమునా నది నీటి విషయంలో హర్యానా, ఢిల్లీ ప్రభుత్వాల మధ్య మాటల యుద్దం నడుస్తోంది.

    ఆప్‌ నేతలు యమునా నదిలో విషం కలిపారని ఆరోపించిన విషయంపై బీజేపీ నేతలు కౌంటరిచ్చారు. దిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి, ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడయ్యే అవకాశముంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అరవింద్ కేజ్రీవాల్
    దిల్లీ

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    అరవింద్ కేజ్రీవాల్

    Delhi next CM : ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ తర్వాత తదుపరి సీఎం ఎవరు?  దిల్లీ
    AAP: దిల్లీ ముందస్తు ఎన్నికలకు ఆప్‌ డిమాండ్‌.. ఎన్నికలపై ఈసీ కీలక నిర్ణయం..! ఎన్నికల సంఘం
    Arvind Kejriwal: రేపు సాయంత్రం సీఎం పదవికి రాజీనామా.. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన కేజ్రీవాల్ దిల్లీ
    Delhi New CM: దిల్లీ కొత్త సీఎంగా ఆతిశీ.. కేజ్రీవాల్ ప్రకటన దిల్లీ

    దిల్లీ

    Bomb Threat: పరీక్షల వాయిదా కోసం విద్యార్థుల బాంబు బెదిరింపులు బాంబు బెదిరింపు
    Delhi weather: గ్రాప్‌-4 నిబంధనలు.. ఆందోళనకర స్థాయికి ఢిల్లీలో వాయు కాలుష్యం వాయు కాలుష్యం
    Delhi: చలి తీవ్రతతో దిల్లీ గజగజ.. రైళ్లు, విమానాల రాకపోకలకు అంతరాయం ఇండియా
    Chandrababu: దిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు.. మోదీ, కేంద్ర మంత్రులతో కీలక చర్చలు చంద్రబాబు నాయుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025