NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / నాకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ ఒక్క మాట మాట్లాడినా కేసు పెడతా: అసోం సీఎం హిమంత
    తదుపరి వార్తా కథనం
    నాకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ ఒక్క మాట మాట్లాడినా కేసు పెడతా: అసోం సీఎం హిమంత
    నాకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ ఒక్క మాట మాట్లాడినా కేసు పెడతా: అసోం సీఎం హిమంత

    నాకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ ఒక్క మాట మాట్లాడినా కేసు పెడతా: అసోం సీఎం హిమంత

    వ్రాసిన వారు Stalin
    Apr 01, 2023
    11:01 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తాను అవినీతిపరుడినంటూ దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తనకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా పరువు నష్టం కేసు పెడతానని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ హెచ్చరించారు.

    పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో పాటు ఆప్ రాష్ట్ర యూనిట్ ఆహ్వానం మేరకు కేజ్రీవాల్ ఏప్రిల్ 2న గువాహటికి వెళ్తున్నారు.

    కాంగ్రెస్‌లో మంత్రిగా ఉన్న సమయంలో హిమంత అవినీతికి పాల్పడ్డారని ఇటీవల దిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ ఆరోపించారు. అతను జైలుకు వెళ్లకుండా కాపాడుకునేందుకే బీజేపీలో చేరారని విమర్శించారు.

    హిమంత

    కేజ్రీవాల్ పిరికివాడిలా అసెంబ్లీలో మాట్లాడారు: హిమంత

    దిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై హిమంత స్పందించారు. తనపై ఏదైనా కేసు లేదా ఎఫ్‌ఐఆర్ ఉందా? అని ప్రశ్నించారు. కేజ్రీవాల్‌పై పరువు నష్టం కేసు పెట్టాలనుకున్నానని, కానీ అతను పిరికివాడిలా అసెంబ్లీ లోపల మాట్లాడారని హిమంత పేర్కొన్నారు.

    2వ తేదీన అసోంకు వచ్చాక తనపై కేసులు ఉన్నాయని చెబితే వెంటనే అతనిపై పరువు నష్టం కేసు పెడతానని చెప్పారు.

    ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను తప్పుదోవ పట్టిస్తున్న రాహుల్ గాంధీ నైతికంగా అవినీతిపరుడని హిమంత అన్నారు.

    2013లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో దోషులుగా తేలిన చట్టసభ సభ్యులపై తక్షణం అనర్హత వేటు పడకుండా కాపాడేందుకు తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను రాహుల్‌చించివేశారని శర్మ గుర్తు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అస్సాం/అసోం
    హిమంత బిస్వా శర్మ
    అరవింద్ కేజ్రీవాల్
    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    తాజా

    Warangal Railway Station: ఆధునిక సౌకర్యాలతో సుందరంగా మారిన వరంగల్ స్టేషన్‌ వరంగల్ తూర్పు
    Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 271, నిఫ్టీ 74 పాయింట్ల చొప్పున నష్టం  స్టాక్ మార్కెట్
    Telangana: తెలంగాణా రాష్ట్రంలోని మూడు రైల్వే స్టేషన్లు పునః ప్రారంభం.. విశేషాలివే  తెలంగాణ
    IPL 2025: ఆర్సీబీ జట్టులో జింబాబ్వే ఫాస్ట్ బౌలర్‌కి అవకాశం బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    అస్సాం/అసోం

    అసోం: బాల్య వివాహాల కేసుల్లో 'పోక్సో'ను ఎందుకు ప్రయోగిస్తున్నారు?: గువాహటి హైకోర్టు ప్రశ్న గుహవాటి
    అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చిన ఎయిర్ టెల్ 5G సేవలు ఎయిర్ టెల్
    భర్త, అత్తను చంపి, శరీర భాగాలను ఫ్రిజ్‌లో దాచిన భార్య గుహవాటి
    ప్రధాని మోదీ తండ్రి పేరును అపహాస్యం చేస్తే దేశం క్షమించదు: హిమంత శర్మ హిమంత బిస్వా శర్మ

    హిమంత బిస్వా శర్మ

    'కాంగ్రెస్, చైనా భాయ్ భాయ్'; రాహుల్ గాంధీపై బీజేపీ కౌంటర్ అటాక్ బీజేపీ

    అరవింద్ కేజ్రీవాల్

    దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు వాదించేందుకు లాయర్లకు ఆప్ ప్రభుత్వం రూ.కోట్ల ఫీజు చెల్లింపు దిల్లీ
    ఆమ్ ఆద్మీ పార్టీకి ఝలక్: ప్రకటనల సొమ్ము రూ. 163కోట్లు చెల్లించాలని డీఐపీ నోటీసులు ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    కేసీఆర్ మాకు పెద్దన్నలాంటి వారు: దిల్లీ సీఎం కేజ్రీవాల్ భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    దిల్లీ: 'మీకు వడ్డించడం అంటే చాలా ఇష్టం', కేజ్రీవాల్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ కౌంటర్ దిల్లీ

    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    దిల్లీ లిక్కర్ స్కామ్‌: రెండో చార్జ్‌షీట్‌లో దిల్లీ సీఎం కేజ్రీవాల్, కవిత పేర్లు దిల్లీ
    పవర్ డిస్కమ్ బోర్డుల నుంచి ఆప్ నామినీలను తొలగించిన లెఫ్టినెంట్ గవర్నర్ దిల్లీ
    దిల్లీ మద్యం కేసు: మనీష్ సిసోడియాకు మరోసారి సీబీఐ నోటీసులు జారీ దిల్లీ
    దిల్లీ మద్యం కేసు: 'ఈ నెల 26న విచారణకు రండి'; మనీష్ సిసోడియాను మళ్లీ సీబీఐ సమన్లు దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025