Page Loader
Hyderabad: మీ ఫోన్లో ఆ యాప్ ఉంటే చాలు.. హైదరాబాద్ సిటీ బస్సుల సమాచారం మీరు ఇంట్లోనే తెలుసుకోవచ్చు!
మీ ఫోన్లో ఆ యాప్ ఉంటే చాలు.. సిటీ బస్సుల సమాచారం మీరు ఇంట్లోనే తెలుసుకోవచ్చు!

Hyderabad: మీ ఫోన్లో ఆ యాప్ ఉంటే చాలు.. హైదరాబాద్ సిటీ బస్సుల సమాచారం మీరు ఇంట్లోనే తెలుసుకోవచ్చు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 04, 2025
01:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ నగరంలో సిటీ బస్సుల్లో ప్రయాణించే ప్రజలకు సిటిజెన్స్ కి గుడ్ న్యూస్ అందింది. ఇప్పుడు మీరు ఎక్కాల్సిన బస్సు ఎక్కడి వరకు వచ్చింది, ఎప్పుడు అందుబాటులో ఉంటుంది అన్న విషయాలను తెలుసుకోవడం చాలా సులభం అయిపోతుంది. నగరంలో అనేక వర్గాలవారు, ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, చిరువ్యాపారులు, సిటీ బస్సులను ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే చాలా మంది బస్సు కోసం గంటల తరబడి బస్టాప్‌లో ఎదురుచూస్తున్నారు. ఈ కారణంగా సమయ వృధాగా మారుతోంది. ఈ ఇబ్బందులను తొలగించేందుకు జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. మీరు ఫోన్‌లో ప్రత్యేక యాప్‌ను డౌన్లోడ్ చేస్తే, ఎక్కడికి వెళ్లాల్సిన బస్సు ఎప్పుడు వచ్చి చేరుతుందో, ఎక్కడ ఉంది అనే విషయాలను తెలుసుకోవచ్చు. .

Details

ఈ యాప్ ప్రత్యేక ఏమిటీ? 

ఫోన్ లేని వ్యక్తులకు కూడా పర్వాలేదు, బస్టాప్‌లలో ప్రత్యేక స్క్రీన్ల ద్వారా బస్సుల వివరాలు ప్రత్యక్షంగా ప్రదర్శిస్తారు. జీహెచ్ఎంసీ, సిటీ బస్సు ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించడానికి 'బస్ ఇన్ఫర్మేషన్ సిస్టం' యాప్‌ను రూపొందించేందుకు ప్లాన్ చేస్తోంది. స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా మీరు ఇంట్లో ఉండి, బస్సుల లైవ్ ట్రాకింగ్ తెలుసుకోవచ్చు. ఫోన్ లేని వారు లేదా యాప్‌ని ఉపయోగించడానికి ఇష్టపడని వారికి బస్టాప్‌ల వద్ద స్క్రీన్ల ద్వారా బస్సుల వివరాలు చూపిస్తారు.

Details

2,800 బస్సులు, 1,250 బస్టాపులు

ప్రారంభంలో, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 2,800 బస్సులలో జీపీఎస్ సిస్టమ్ అమర్చే చర్యలు చేపడుతున్నారు. ఆ తరువాత, 1,250 బస్టాప్‌లలో ప్రయాణికులు ఎక్కడి వరకు వచ్చిందో తెలుసుకోవడానికి ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేస్తారు. ఈ స్క్రీన్ల ద్వారా బస్సు నెంబర్, ఏ ప్రాంతం నుంచి వస్తున్నదీ, బస్సు ప్రస్తుతం ఎక్కడ ఉన్నదీ వంటి వివరాలు ప్రదర్శిస్తారు. ఈ యాప్, స్క్రీన్ సిస్టం కలిపి హైదరాబాద్ నగరాన్ని మరింత స్మార్ట్‌గా మార్చే క్రమంలో మరింత సమయం ఆదా చేసే విధంగా పనిచేస్తుంది. త్వరలోనే ఈ యాప్ విడుదల కానుంది. బస్టాప్‌లలో స్క్రీన్లను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.