NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మధ్యప్రదేశ్‌: లంచం తీసుకుంటుండగా పట్టుకున్న లోకాయుక్త; కరెన్సీని మింగేసిన అధికారి
    తదుపరి వార్తా కథనం
    మధ్యప్రదేశ్‌: లంచం తీసుకుంటుండగా పట్టుకున్న లోకాయుక్త; కరెన్సీని మింగేసిన అధికారి
    మధ్యప్రదేశ్‌: లంచం తీసుకుంటుండగా పట్టుకున్న లోకాయుక్త; కరెన్సీని మింగేసిన అధికారి

    మధ్యప్రదేశ్‌: లంచం తీసుకుంటుండగా పట్టుకున్న లోకాయుక్త; కరెన్సీని మింగేసిన అధికారి

    వ్రాసిన వారు Stalin
    Jul 25, 2023
    11:30 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలో రెవెన్యూ శాఖకు చెందిన అవినీతి అధికారి వింత ప్రవర్తన ఆందోళన కలిగించింది.

    లంచం తీసుకుంటుండగా పట్వారీ గజేంద్ర సింగ్‌ను జబల్‌పూర్ లోకాయుక్త స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఎస్‌పీఈ) బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.

    ఈ క్రమంలో లంచంగా తీసుకున్న కరెన్సీ నోట్లు అధికారులకు ఇవ్వకుండా నోటిలో పెట్టుకుని నమిలాడు.

    పట్వారీ చర్యతో భయాందోళనకు గురైన పోలీసు బృందం అతన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. దీంతో వైద్యులు అతని నోటి నుంచి నోట్లను బయటకు తీశారు.

    అతను బాగానే ఉన్నారని పోలీసులు వెల్లడించారు. పట్వారీ నోట్లను నమిలే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    ఎంపీ

    లోకాయుక్త అధికారుల పన్ని ఉచ్చులో పడ్డ గజేంద్ర సింగ్ 

    కాట్నీ జిల్లాలోని బద్‌ఖేరాకు చెందిన చందన్‌సింగ్ లోధి వ్యక్తి దగ్గర భూమి పట్టా జారీ విషయమై గజేంద్ర సింగ్ రూ.5వేలు లంచం డిమాండ్ చేశారు.

    దీంతో బాధితుడు జబల్‌పూర్ లోకాయుక్త ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు జబల్‌పూర్ లోకాయుక్త టీమ్ ఇన్‌స్పెక్టర్ కమల్‌కాంత్ ఉకే మీడియాకు తెలిపారు.

    లోకాయుక్త అధికారులు పన్నిన ఉచ్చులో గజేంద్ర సింగ్ పడ్డారు. లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఎస్‌ఎఫ్‌ఈ బృందాన్ని గుర్తించిన వెంటనే డబ్బు నమిలి గజేంద్ర సింగ్ మింగేశారు..

    సింగ్‌ను అరెస్టు చేసి ఆసుపత్రికి తరలించినట్లు ఎస్పీఈ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) సంజయ్ సాహు తెలిపారు. గజేంద్ర సింగ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సాహు పేర్కొన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కరెన్సీ నోట్లను నముతున్న రెవెన్యూ అధికారి

    A patwari in Katni, allegedly swallowed money he had accepted as a bribe after noticing a team of the Lokayukta's Special Police Establishment pic.twitter.com/AgsOyDsnGM

    — Anurag Dwary (@Anurag_Dwary) July 24, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్
    తాజా వార్తలు

    తాజా

    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్
    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా

    మధ్యప్రదేశ్

    గుడి గోపురంపై కుప్పకూలిన విమానం భారతదేశం
    కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత, ప్రధాని మోదీ సంతాపం జనతాదళ్ (యునైటెడ్)
    జీ20: భోపాల్‌లో రెండు రోజుల పాటు 'థింక్-20' సమావేశాలు శివరాజ్ సింగ్ చౌహాన్
    మధ్యప్రదేశ్‌: భార్య, ఇద్దరు పిల్లలను గొడ్డలితో నరికి, ఇంట్లోనే పూడ్చిపెట్టాడు భారతదేశం

    తాజా వార్తలు

    Manipur video case: మణిపూర్ వీడియో కేసులో మరొకరు అరెస్టు మణిపూర్
    జులై 22న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం  ఫ్రీ ఫైర్ మాక్స్
    Uttar pradesh: చెల్లిని నరికి చంపి, తలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన యువకుడు  ఉత్తర్‌ప్రదేశ్
    మీ మెదడును చురుగ్గా, ఆరోగ్యంగా ఉంచే వ్యాయామాలు ఏంటో తెలుసుకోండి  వ్యాయామం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025