NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Poll ads: ఎన్నికల ప్రకటనల్లో బీఆర్ఎస్‍ను మించిపోయిన కాంగ్రెస్.. ఎన్ని రూ.కోట్లు అంటే?
    తదుపరి వార్తా కథనం
    Poll ads: ఎన్నికల ప్రకటనల్లో బీఆర్ఎస్‍ను మించిపోయిన కాంగ్రెస్.. ఎన్ని రూ.కోట్లు అంటే?
    Poll ads: ఎన్నికల ప్రకటనల్లో బీఆర్ఎస్‍ను మించిపోయిన కాంగ్రెస్.. ఎన్ని రూ.కోట్లు అంటే?

    Poll ads: ఎన్నికల ప్రకటనల్లో బీఆర్ఎస్‍ను మించిపోయిన కాంగ్రెస్.. ఎన్ని రూ.కోట్లు అంటే?

    వ్రాసిన వారు Stalin
    Dec 11, 2023
    10:27 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నవంబర్‌లో తెలంగాణ, ఛతీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

    ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు డిజిటల్ యాడ్స్ కోసం భారీగా ఖర్చు చేసాయి.

    ముఖ్యంగా మెటా( ఫేస్‌బుక్, ఇన్‍‌స్టా), గూగుల్ యాడ్స్ కోసం ఆయా పార్టీలు ఓ రేంజ్‌లో ప్రకటనలు ఇచ్చాయి.

    ఈ క్రమంలో నవంబర్ నెలలో డిజిటల్ యాడ్స్ కోసం ఏ పార్టీ ఎంత ఖర్చు పెట్టిందనే అంశంపై 'హిందుస్థాన్ టైమ్స్' ఓ నివేదికలను విడుదల చేసింది. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

    నవంబర్‌లో మెటా( ఫేస్‌బుక్, ఇన్‍‌స్టా) ప్లాట్‌ఫారమ్‌లలో 7,901 ప్రకటనల కోసం టాప్-20 రాజకీయ ప్రకటనదారులు రూ.5.98 కోట్లు ఖర్చు చేశారు.

    యాడ్స్

    కాంగ్రెస్ రూ.14.3 కోట్లు, బీఆర్ఎస్ రూ.12.1 కోట్లు

    అదే నవంబర్‌లో గూగుల్ యాడ్స్ కోసం రూ.36.31 కోట్లను వెచ్చించారు. గత నెల మొత్తం 15,405 రాజకీయ ప్రకటనలు గూగుల్‌లో ప్రచురితమయ్యాయి.

    అటు గూగుల్, ఇటు మెటాలో టాప్ -20 రాజకీయ ప్రకటనదారులను పోల్చి చూస్తే కాంగ్రెస్ టాప్‌లో ఉంది.

    ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో కాంగ్రెస్ పార్టీ, దాని అనుబంధ శాఖలు నేరుగా రు.2.58 కోట్ల ప్రకటనలు ఇవ్వగా.. ఆ పార్టీ అభిమానులు రూ.2.24 కోట్ల విలువైన యాడ్స్ ప్రచురించారు.

    ఇక గూగుల్స్ యాడ్స్‌లోనూ కాంగ్రెస్ ముందు వరుసలో ఉంది. కాంగ్రెస్ రూ.14.3 కోట్లు, భారత రాష్ట్ర సమితి రూ.12.1 కోట్లు, బీజేపీ రూ.4.16 కోట్లు ఖర్చు చేసింది.

    యాడ్స్

    వాస్తవానికి బీఆర్ఎస్ ఖర్చే ఎక్కువ.. కానీ.. 

    ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఒక రాష్ట్రంలో పోటీ చేసిన బీఆర్ఎస్ రూ.12.1కోట్లు ఖర్చు చేస్తే.. ఐదు రాష్ట్రాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ రూ.14.3కోట్లు వెచ్చించడం గమనార్హం.

    వాస్తవానికి డిజిటల్ యాడ్స్‌లో బీఆర్ఎస్ టాప్ అని చెప్పాలి. కానీ లెక్కల పరంగా చూస్తే కాంగ్రెస్ ఎక్కువ ఖర్చు చేసింది.

    అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇంత తక్కువ మొత్తంలో డిజిటల్ యాడ్స్ ఇచ్చిందా? అనే ప్రశ్న రావొచ్చు.

    అయితే బీజేపీ డిజిటల్ యాడ్స్ కంటే.. సోషల్ మీడియా క్యాంపెయినింగ్‌పైనే ఫోకస్ పెట్టింది. మీమ్‌లు, కౌంటర్ వీడియోల ద్వారా బాగా ప్రజల్లోకి వెళ్లింది.

    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోని ఆన్‌లైన్ ప్రకటనల్లో ఎక్కువ భాగం నవంబర్ నెలలో తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలోనే ఖర్చు చేసారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అసెంబ్లీ ఎన్నికలు
    ప్రకటన
    పోలింగ్
    తాజా వార్తలు

    తాజా

    Hill Sations In AP: సిమ్లా, ముసూరి వెళ్లాల్సిన అవసరం లేదు.. ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్న ఈ హిల్ స్టేషన్లు చాలు! వేసవి కాలం
    CM Revanth Reddy: 'ఇందిర సౌర గిరి జల వికాసం' ద్వారా 6 లక్షల ఎకరాల్లో సాగునీరు  రేవంత్ రెడ్డి
    Jyoti Malhotra: పాక్ ISIతో సంబంధాలపై ఆరోపణలు.. యూట్యూబర్ జ్యోతి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సస్పెండ్ జ్యోతి మల్హోత్రా
    Ghattamaneni JayaKrishna: ఘట్టమనేని కుటుంబం నూతన హీరోగా జయకృష్ణ అరంగ్రేటం..? మహేష్ బాబు

    అసెంబ్లీ ఎన్నికలు

    BRS: బీఆర్ఎస్‌లో చేరిన  ఆందోల్ బీజేపీ అభ్యర్థి బాబు మోహన్‌ కుమారుడు బీఆర్ఎస్
    KCR: ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. కొత్త పథకాన్ని ప్రకటించిన కేసీఆర్ తెలంగాణ
    Telangana Election: బీఎస్పీ మీటింగ్‌లో కూలిన టెంట్.. 15మందికి గాయాలు  వేములవాడ
    Divyavani: కాంగ్రెస్‌లో చేరిన ప్రముఖ నటి దివ్యవాణి కాంగ్రెస్

    ప్రకటన

    2023 ఫారిన్ ట్రేడ్ పాలసీని ఆవిష్కరించిన కేంద్ర ప్రభుత్వం వ్యాపారం
    టేకిలా తర్వాత, గిగాబియర్‌ను ప్రారంభించిన టెస్లా ఎలాన్ మస్క్
    డాలర్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశాలకు రూపాయి వాణిజ్య ఎంపికను అందిస్తున్న భారతదేశం వ్యాపారం
    ఎయిర్ ఇండియా కొన్ని అంతర్జాతీయ మార్గాలలో అందిస్తున్న ప్రీమియం ఎకానమీ అనుభవం విమానం

    పోలింగ్

    అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: నాగాలాండ్, త్రిపురలో బీజేపీ ఆధిక్యం; మేఘాలయలో ఎన్‌పీపీ హవా అసెంబ్లీ ఎన్నికలు
    ఎన్నికల ఫలితాలు: నాగాలాండ్, త్రిపురలో కమల వికాసం; మేఘాలయలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన ఎన్‌పీపీ అసెంబ్లీ ఎన్నికలు
    అసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక‌లో రేపే పోలింగ్; ముఖ్యాంశాలు ఇవే కర్ణాటక
    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: కొనసాగుతున్న పోలింగ్; ఓటేసిన ప్రముఖులు కర్ణాటక

    తాజా వార్తలు

    Byju's: ఇళ్లను తాకట్టు పెట్టి.. ఉద్యోగులకు జీతాలు చెల్లించిన బైజూస్ వ్యవస్థాపకుడు బైజూస్‌
    విజయవాడ: అక్కినేని హాస్పిటల్‌లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం విజయవాడ సెంట్రల్
    Vijayashanti: కేసీఆర్ ఎమ్మెల్యేగా ఓడిపోవడంపై విజయశాంతి ఆసక్తికర కామెంట్స్  విజయశాంతి
    Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్‌ను భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో చంద్రయాన్-3
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025