Uttarakhand tunnel: ఉత్తరాఖండ్లో కూలిన సొరంగం.. శిథిలాల కింద చిక్కుకున్న 40 కార్మికులు
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తరకాశీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో ప్రమాదం జరిగింది. యమునోత్రి జాతీయ రహదారిపై సిల్క్యారా నుంచి దండల్గావ్ వరకు నిర్మిస్తున్న సొరంగం కూలిపోయింది. సొరంగంలో కొందరు కార్మికులు చిక్కుకుపోయారు. చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి జిల్లా యంత్రాంగం ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్ను పంపారు. ఈ ఘటన శనివారం అర్థరాత్రి సమయంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. కూలిపోయిన సొరంగంలో దాదాపు 40 మంది కార్మికులు చిక్కుకుపోయారు. శిథిలాలు సిల్క్యారా వైపు 200 మీటర్ల ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు. అందులో పనిచేస్తున్న కూలీలంతా 800 మీటర్ల దూరంలో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.
సొరంగంలోకి పైపుల ద్వారా ఆక్సిజన్ అందిస్తున్న రెస్క్యూ టీమ్
సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు పైపుల ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నారు. ప్రస్తుతం, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. 2021లో ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో జరిగిన ప్రమాదంలో కూడా కార్మికులు సొరంగంలో చిక్కుకున్నారు. తపోవన్ సొరంగంలో కార్మికులు చిక్కుకున్నారు. సొరంగం నుంచి శిధిలాలను తొలగించడానికి జేసీబీతో పాటు డంపర్లను మోహరించారు. చాలా రోజుల పాటు సహాయక చర్యలు కొనసాగాయి. సొరంగంలో చిక్కుకున్న వ్యక్తులను రక్షించేందుకు కొత్త యంత్రాలతో డ్రిల్ చేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో 53 మంది కూలీలు మృతి చెందారు.