NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / బీబీసీ కార్యాలయాల్లో రెండోరోజు కొనసాగుతున్న ఆదాయపు పన్నుశాఖ సోదాలు
    భారతదేశం

    బీబీసీ కార్యాలయాల్లో రెండోరోజు కొనసాగుతున్న ఆదాయపు పన్నుశాఖ సోదాలు

    బీబీసీ కార్యాలయాల్లో రెండోరోజు కొనసాగుతున్న ఆదాయపు పన్నుశాఖ సోదాలు
    వ్రాసిన వారు Naveen Stalin
    Feb 15, 2023, 05:10 pm 1 నిమి చదవండి
    బీబీసీ కార్యాలయాల్లో రెండోరోజు కొనసాగుతున్న ఆదాయపు పన్నుశాఖ సోదాలు

    ముంబయి, దిల్లీలో బీబీసీకి చెందిన కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు బుధవారం కూడా కొనసాగాయి. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఐటీ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. 2012 నాటి ఖాతా వివరాలను కూడా తనిఖీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బీబీసీ అనుబంధ కంపెనీల అంతర్జాతీయ పన్నులు, నదగు బదిలీలో జరిగిన అవకతవకలను తేల్చేందుకు ఈ సర్వేలు జరుగుతున్నాయని అధికారులు చెప్పారు. ఇదిలా ఉంటే, బీబీసీ సిబ్బంది నుంచి తీసుకున్న ఫోన్లను తిరిగి ఇచ్చేస్తామని, ఇవి ఐటీ దాడులు కాదని, సర్వే మాత్రమే చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. బీబీసీ వద్ద చాలా డేటా ఉందని, అందుకే ఒక రోజులో ఈ సర్వే తేలదని ఐటీ అధికారులు చెబుతున్నారు.

    ఐటీ సోదాలపై స్పందించిన అమెరికా

    బీబీసీ ఆఫీసులపై దాడుల అంశం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది. ఇప్పటికే దీనిపై అమెరికా కూడా స్పందించింది. ఐటీ దాడులు జరుగుతున్నాయని తమకు తెలుసునని, దానిపై ఇప్పుడే ఎటువంటి వ్యాఖ్యలు చేయలేమని అమెరికా పేర్కొంది. అయితే ఈ వ్యవహారంపై యునైటెడ్ కింగ్‌డమ్ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. గ్లోబల్ మీడియా హక్కుల సంఘాలు, భారతదేశ ప్రతిపక్ష నాయకులు ఈ దాడులను తీవ్రంగా ఖండించారు. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోదీ ప్రమేయం ఉందంటూ 'ఇండియా: ది మోదీ క్వచ్చన్' పేరుతో రెండు ఎపిసోడ్లతో కూడిన డాక్యుమెంటరీని బీబీసీ రూపొందించింది. ఆ డాక్యుమెంటరీ వీడియో లింకులపై కేంద్రం నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో బీబీసీ ఆఫీస్‌లపై ఐటీ దాడులు చేయడం గమనార్హం.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    దిల్లీ
    ముంబై
    బీబీసీ
    డాక్యుమెంటరీ

    దిల్లీ

    పార్లమెంట్ ప్రారంభోత్సవానికి గుర్తుగా విడుదల చేసిన రూ.75 నాణెం ప్రత్యేకతలు, ఎలా కొనాలి? నరేంద్ర మోదీ
    పైలట్లకు 'గో ఫస్ట్' ఎయిర్‌లైన్ బంపర్ ఆఫర్; అదనంగా రూ.1లక్ష వేనతం  విమానం
    రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో స్నేహగీతం; అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌ మధ్య శాంతి ఒప్పందం  రాజస్థాన్
    దిల్లీ హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టేడయంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన మనీష్ సిసోడియా‌  మనీష్ సిసోడియా

    ముంబై

    26/11 దాడుల నిందితుడు తహవుర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా కోర్టు గ్రీన్ సిగ్నల్  అమెరికా
    మహేష్ మూర్తిపై జిలింగో మాజీ సీఈఓ అంకితి బోస్ 100మిలియన్ డాలర్ల పరువునష్టం దావా  భారతదేశం
     2025 నాటికి దేశంలో 10,000 కి.మీల 'డిజిటల్ హైవే' అభివృద్ధి: హైవే అథారిటీ  టెక్నాలజీ
    ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్, దిల్లీ, ముంబైకి చోటు హైదరాబాద్

    బీబీసీ

    BBC Documentary on Modi: పరువు నష్టం కేసులో బీబీసీకి దిల్లీ హైకోర్టు సమన్లు  డాక్యుమెంటరీ
    విదేశీ నిధుల్లో అవకతవకలు; బీబీసీపై కేసు నమోదు చేసిన ఈడీ  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాల అంశం; బ్రిటన్ మంత్రికి గట్టిగానే చెప్పిన జైశంకర్ సుబ్రమణ్యం జైశంకర్
    బీబీసీ కార్యాలయాల్లో ముగిసిన ఐటీ సోదాలు ప్రపంచం

    డాక్యుమెంటరీ

    ఆస్కార్ గెలిచిన 'ఎలిఫెంట్ విస్పరర్స్' ఏనుగును చూసేందుకు తరలివస్తున్న పర్యాటకులు ఆస్కార్ అవార్డ్స్
    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలపై రాజకీయ దుమారం బీబీసీ
    BBC: బీబీసీ దిల్లీ, ముంబయి కార్యాలయాల్లో ఐటీ బృందాల సోదాలు బీబీసీ
    బీబీబీ డాక్యుమెంటరీని నిషేధించడంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు సుప్రీంకోర్టు

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023