NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / BBC: బీబీసీ దిల్లీ, ముంబయి కార్యాలయాల్లో ఐటీ బృందాల సోదాలు
    భారతదేశం

    BBC: బీబీసీ దిల్లీ, ముంబయి కార్యాలయాల్లో ఐటీ బృందాల సోదాలు

    BBC: బీబీసీ దిల్లీ, ముంబయి కార్యాలయాల్లో ఐటీ బృందాల సోదాలు
    వ్రాసిన వారు Naveen Stalin
    Feb 14, 2023, 02:40 pm 1 నిమి చదవండి
    BBC: బీబీసీ దిల్లీ, ముంబయి కార్యాలయాల్లో ఐటీ బృందాల సోదాలు
    బీబీసీ దిల్లీ, ముంబయి కార్యాలయాల్లో ఐటీ బృందాల సోదాలు

    ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) అధికారులు మంగళవారం దిల్లీ, ముంబయిలోని బీబీసీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. అంతర్జాతీయ పన్నులు, నగదు బదిలీల్లో అవకతవకలకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో బీబీసీ కార్యాలయాల్లో సోదాలు జరిగినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోదీ ప్రమేయం ఉందంటూ 'ఇండియా: ది మోదీ క్వచ్చన్' పేరుతో రెండు ఎపిసోడ్లతో కూడిన డాక్యుమెంటరీని బీబీసీ రూపొందించింది. ఆ డాక్యుమెంటరీ వీడియో లింకులపై కేంద్రం నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో బీబీసీ ఆఫీస్‌లపై ఐటీ దాడులు చేయడం గమనార్హం.

    ఉద్యోగులను ఇంటికి పంపించిన ఐటీ అధికారులు

    దిల్లీలో ఐటీ అధికారులు బీబీసీ ఆఫీస్‌లోకి వెళ్లిన వెంటనే ఉద్యోగుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారిని ఇంటి నుంచి పని చేసుకోవాలని సూచించారు. ఉర్దూ సేవలను చూస్తున్న ఇద్దరు వ్యక్తులు, ఆర్థికశాఖ అధికారులతో పాటు కార్యాలయం ఆవరణలో ఉన్నట్లు సిబ్బంది చెప్పారు. ఇదిలా ఉంటే, బీబీసీకి ముంబయిలో రెండు కార్యాలయాలు ఉన్నాయి. ఒకటి బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌(బీకేసీ)లో ఉండగా, ఇంకోటి ఖార్ లో ఉంది. ఐటీ అధికారులు బీకేసీ కార్యాలయ ఆవరణలో ఉండగా, బీబీసీ ఖార్ కార్యాలయంలోని ఉద్యోగులను ఇళ్లకు వెళ్లాల్సిందిగా కోరారు. సంస్థ వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన పత్రాలతో పాటు భారతీయ విభాగానికి సంబంధించిన పత్రాలను పరిశీలిస్తున్నట్లు ఐటీ అధికారులు చెప్పారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    గుజరాత్
    నరేంద్ర మోదీ
    దిల్లీ
    ఆదాయం

    గుజరాత్

    కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం వెనుక ఉన్న బిమల్ పటేల్ గురించి తెలుసా?  దిల్లీ
    గుజరాత్‌లో రూ.4400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభించిన ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    డిఫరెంట్ ఫ్లేవర్లతో గోల్డెన్ ఐస్ క్రీమ్; ఎక్కడో తెలుసా?  సూరత్
    రాహుల్ గాంధీకి చుక్కెదురు; జైలు శిక్షపై స్టే ఇచ్చేందుకు సూరత్ కోర్టు నిరాకరణ  రాహుల్ గాంధీ

    నరేంద్ర మోదీ

    యూపీలో బీజేపీ 'ఖానే పే చర్చా'; 2024 సార్వత్రిక ఎన్నికలే మోదీ-యోగి టార్గెట్  ఉత్తర్‌ప్రదేశ్
    పార్లమెంట్ ప్రారంభోత్సవానికి గుర్తుగా విడుదల చేసిన రూ.75 నాణెం ప్రత్యేకతలు, ఎలా కొనాలి? దిల్లీ
    గువాహటి-న్యూ జల్‌పైగురి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ  వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    కొత్త పార్లమెంట్ భవనం శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ ప్రధాన మంత్రి

    దిల్లీ

    పైలట్లకు 'గో ఫస్ట్' ఎయిర్‌లైన్ బంపర్ ఆఫర్; అదనంగా రూ.1లక్ష వేనతం  విమానం
    రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో స్నేహగీతం; అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌ మధ్య శాంతి ఒప్పందం  రాజస్థాన్
    దిల్లీ హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టేడయంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన మనీష్ సిసోడియా‌  మనీష్ సిసోడియా
    దిల్లీ హత్య కేసులో ట్విస్ట్; ప్రియుడిని బొమ్మ తుపాకీతో బెదిరించిన బాలిక హత్య

    ఆదాయం

    2023-24 ఐటీ రిటర్న్స్: ITR-1, ITR-4 ఆఫ్‌లైన్ ఫామ్స్ విడుదల ఆదాయపు పన్నుశాఖ/ఐటీ
    ఆరుసార్లు పెరిగిన తర్వాత, రెపో రేటును 6.5% నుండి పెంచని ఆర్‌బిఐ ఆర్ బి ఐ
    ఈవెంట్ అతిథిగా మస్క్ వస్తున్నారంటూ రూ.8,000 టిక్కెట్ తో మోసం చేసిన స్టార్ట్-అప్ వ్యాపారం
    టాల్క్ క్యాన్సర్ క్లెయిమ్‌ల కోసం $8.9 బిల్లియన్స్ ప్రతిపాదించిన జాన్సన్ & జాన్సన్ వ్యాపారం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023