LOADING...
Godavari River: గోదావరిలో పెరిగిన ప్రవాహం.. కూనవరం, ధవళేశ్వరం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న నీరు 
గోదావరిలో పెరిగిన ప్రవాహం.. కూనవరం, ధవళేశ్వరం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న నీరు

Godavari River: గోదావరిలో పెరిగిన ప్రవాహం.. కూనవరం, ధవళేశ్వరం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న నీరు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 26, 2025
12:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు, తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నదిలో మళ్లీ వరద ఉధృతి పెరిగింది. భద్రాచలం, కూనవరం, ధవళేశ్వరం వంటి ప్రధాన ప్రాంతాల్లో నీటి ప్రవాహం తీవ్రంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Details

ప్రధాన స్థావరాల్లో నీటిమట్టం ఇలా ఉంది 

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 32.2 అడుగులకు చేరింది. కూనవరం వద్ద నీటిమట్టం 12.26 మీటర్లుగా నమోదైంది. పోలవరం వద్ద నీటి మట్టం 8.19 మీటర్లు. ధవళేశ్వరం వద్ద గోదావరి ఇన్‌ఫ్లో మరియు అవుట్‌ఫ్లో 3.60 లక్షల క్యూసెక్కులుగా ఉన్నట్లు APSDMA పేర్కొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతాల్లోని అధికారులు అప్రమత్తమయ్యారు. లంక గ్రామాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. వరద ముప్పు నేపథ్యంలో ప్రజలు అలెర్ట్‌గా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

Details

తుంగభద్ర నదిలో కూడా వరద ఉద్ధృతి

తుంగభద్ర నదిలో కూడా వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం అక్కడ ప్రవాహం 50 వేల క్యూసెక్కులుగా ఉంది. ఇది త్వరలోనే 60 నుంచి 90 వేల క్యూసెక్కుల వరకు చేరే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. తుంగభద్ర పరివాహక ప్రాంతాల ప్రజలు, లోతట్టు గ్రామాల్లో నివసిస్తున్నవారు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. భారీ వర్షాలకు అవకాశం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా కోస్తాంధ్రలో ఆదివారం వరకు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఏపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్‌ నుంచి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించే ఏర్పాట్లు చేశారు.

Details

అత్యవసర కాంటాక్ట్ నంబర్లు

ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం టోల్‌ఫ్రీ కంట్రోల్ రూమ్ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది 112 1070 18004250101 మత్స్యకారులకు ప్రత్యేక సూచనగా, సోమవారం వరకు వారు సముద్రంలో వేటకు వెళ్లవద్దని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే అధికారులను సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది.