NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhra Pradesh: రాష్ట్రంలో పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు..  
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Andhra Pradesh: రాష్ట్రంలో పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు..  
    రాష్ట్రంలో పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు.. నందిగామలో 38.4 డిగ్రీల నమోదు

    Andhra Pradesh: రాష్ట్రంలో పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు..  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 05, 2025
    09:07 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాష్ట్రవ్యాప్తంగా కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

    ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే, ఇక వేసవిలో పరిస్థితి ఏంటని భయపడుతున్నారు. భూతాపం ప్రభావంతో 2024 సంవత్సరం అత్యంత వేడిగా నమోదైంది.

    భారత వాతావరణ శాఖ (IMD) అంచనా ప్రకారం, ఈ ఏడాది కూడా గత ఏడాది తరహాలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

    ఈసారి శీతాకాలంలో చలి తీవ్రత తగ్గిపోయింది. ఫిబ్రవరిలోనే అసాధారణంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ నిపుణులు ముందుగానే హెచ్చరించారు.

    ఈ నెల రెండో వారం నుంచి రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

    వివరాలు 

    ఈ ప్రాంతాలల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం

    మంగళవారం తుని, నరసాపురం, కాకినాడ, మచిలీపట్నం, నందిగామ, బాపట్ల, కావలి, కర్నూలు వంటి ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 6 డిగ్రీల వరకు పెరిగాయి.

    దీని ప్రభావంగా ఉక్కపోత పెరిగి, ప్రజలు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. రాబోయే రెండు రోజులలో కోస్తా జిల్లాల్లో 2 నుంచి 4 డిగ్రీల వరకు, రాయలసీమలో 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

    వివరాలు 

    అధిక ఉష్ణోగ్రతల ప్రభావం 

    2010-2024 కాలంలో - ఈ పదేళ్ల కాలంలో చాలా సంవత్సరాలు అత్యంత వేడిగా నమోదయ్యాయి.

    2015-2024 - ఈ దశాబ్దం అత్యంత వేడిగా మిగిలింది. ఉష్ణోగ్రతలు సగటున 0.31 డిగ్రీల మేర పెరిగాయి.

    గత పరిశోధనల ప్రకారం - ఉష్ణోగ్రత ఒక్క డిగ్రీ పెరిగినప్పుడు, మరణాల శాతం 0.2% నుంచి 5.5% వరకు పెరిగే అవకాశం ఉంది.

    భవిష్యత్తు అంచనా - ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ, వడగాలులు మరింత తీవ్రమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    వాతావరణ శాఖ

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    ఆంధ్రప్రదేశ్

    Ap Aadhaar Camps: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. చిన్నారులకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు భారతదేశం
    Chandrababu: గ్రీన్ ఎనర్జీ పెట్టుబడుల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్.. దావోస్‌లో చంద్రబాబు ప్రసంగం చంద్రబాబు నాయుడు
    APPSC Group 1 Mains Exam Schedule: ఏపీ గ్రూప్‌-1 మెయిన్స్‌ షెడ్యూల్‌ విడుదల భారతదేశం
    AP Liquor Shops: గీత కార్మికులకు 335 మద్యం షాపులు కేటాయింపు.. నోటిఫికేషన్ జారీ భారతదేశం

    వాతావరణ శాఖ

    Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి భారీ వర్షాలు  భారతదేశం
    Heavy rains: అలర్ట్.. తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు తెలంగాణ
    Monsoon: రైతులకు వాతావరణ విభాగం బ్యాడ్ న్యూస్.. సెప్టెంబర్‌ నెలాఖరు వరకు వర్షాలు   వాతావరణ మార్పులు
    AP Rains: అలర్ట్.. రానున్న మూడ్రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025