Page Loader
Andhra Pradesh: రాష్ట్రంలో పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు..  
రాష్ట్రంలో పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు.. నందిగామలో 38.4 డిగ్రీల నమోదు

Andhra Pradesh: రాష్ట్రంలో పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు..  

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 05, 2025
09:07 am

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రవ్యాప్తంగా కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే, ఇక వేసవిలో పరిస్థితి ఏంటని భయపడుతున్నారు. భూతాపం ప్రభావంతో 2024 సంవత్సరం అత్యంత వేడిగా నమోదైంది. భారత వాతావరణ శాఖ (IMD) అంచనా ప్రకారం, ఈ ఏడాది కూడా గత ఏడాది తరహాలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈసారి శీతాకాలంలో చలి తీవ్రత తగ్గిపోయింది. ఫిబ్రవరిలోనే అసాధారణంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ నిపుణులు ముందుగానే హెచ్చరించారు. ఈ నెల రెండో వారం నుంచి రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

వివరాలు 

ఈ ప్రాంతాలల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం

మంగళవారం తుని, నరసాపురం, కాకినాడ, మచిలీపట్నం, నందిగామ, బాపట్ల, కావలి, కర్నూలు వంటి ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 6 డిగ్రీల వరకు పెరిగాయి. దీని ప్రభావంగా ఉక్కపోత పెరిగి, ప్రజలు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. రాబోయే రెండు రోజులలో కోస్తా జిల్లాల్లో 2 నుంచి 4 డిగ్రీల వరకు, రాయలసీమలో 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

వివరాలు 

అధిక ఉష్ణోగ్రతల ప్రభావం 

2010-2024 కాలంలో - ఈ పదేళ్ల కాలంలో చాలా సంవత్సరాలు అత్యంత వేడిగా నమోదయ్యాయి. 2015-2024 - ఈ దశాబ్దం అత్యంత వేడిగా మిగిలింది. ఉష్ణోగ్రతలు సగటున 0.31 డిగ్రీల మేర పెరిగాయి. గత పరిశోధనల ప్రకారం - ఉష్ణోగ్రత ఒక్క డిగ్రీ పెరిగినప్పుడు, మరణాల శాతం 0.2% నుంచి 5.5% వరకు పెరిగే అవకాశం ఉంది. భవిష్యత్తు అంచనా - ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ, వడగాలులు మరింత తీవ్రమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.