Independence Day 2023: పోస్టాఫీస్లుల్లో త్రివర్ణ ప్రతాకం; రూ.25లకే విక్రయిస్తున్న కేంద్రం
ఈ వార్తాకథనం ఏంటి
ఆగస్టు 15న దేశవ్యాప్తంగా 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకునేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.
పౌరులందరూ తమ ఇళ్లలో జాతీయ జెండాను ఎగురవేసేలా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 'ప్రతి ఇంటికి త్రివర్ణ ప్రతాకం' అనే ప్రత్యేక ప్రచారాన్ని కార్యక్రమాన్ని ప్రారంభించింది.
దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లో 'హర్ ఘర్ తిరంగ అభియాన్' కింద త్రివర్ణ పతాకాన్ని కేంద్రం కేవలం రూ.25లకే విక్రయిస్తోంది.
'హర్ ఘర్ తిరంగ అభియాన్' కింద తపాలా శాఖ తన వెబ్ పోర్టల్ www.indiapost.gov.in ద్వారా జాతీయ జెండాను ఆన్లైన్లో విక్రయించనుంది.
దేశంలో 1.60లక్షల పోస్టాఫీసులు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి ఇంటికి పతాకాన్ని అందజేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఆగస్టు 13నుంచి 15మధ్య ప్రతి ఇంటికీ ప్రభుత్వం త్రివర్ణ పతాక ప్రచారాన్ని నిర్వహించనుంది.
జాతీయ పతాకం
ఆన్లైన్లో ఇలా కొనుగోలు చేయాలి
పౌరులు జాతీయ జెండాను డిపార్ట్మెంట్ ఇ-పోస్టాఫీసు సౌకర్యం ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. త్రివర్ణ పతాకాన్ని ఆన్లైన్లో కొనుగోలు చేయడానికి ఇలా చేయండి.
1. ముందు www.indiapost.gov.in లింక్పై క్లిక్ చేయాలి. తర్వాత లాగిన్ వివరాలను నమోదు చేయాలి.
2. అనంతరం ప్రొడక్ట్ సెక్షన్కి వెళ్లి నేషనల్ ఫ్లాగ్ ఆప్షన్పై క్లిక్ చేసి కార్ట్లో యాడ్ చేయండి.
3. ఆ తర్వాత బై నౌ ఆప్షన్పై క్లిక్ చేసి మరోసారి మొబైల్ నంబర్ను నమోదు చేయండి. అనంతరం వచ్చిన ఓటీపీని నమోదు చేయాలి.
4. పేమెంట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. మీకు అందులో బాటులో ఉన్న ఆన్ లైన్ మోడ్లో రూ.25లను చెల్లించాలి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆల్ ఇండియా రేడియో చేసిన ట్వీట్
.@IndiaPostOffice to sell #NationalFlag through its 1.60 lakh post offices to celebrate #HarGharTiranga. The Government is organising Har Ghar Tiranga campaign between 13 to 15 August. The citizens can also purchase the national flag through ePostOffice facility of the…
— All India Radio News (@airnewsalerts) August 1, 2023