NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / భారత్-చైనా: 1962 యుద్ధం, 2020లో ఘర్షణ మధ్య పోలిక లేదు: జైరామ్ రమేష్
    భారతదేశం

    భారత్-చైనా: 1962 యుద్ధం, 2020లో ఘర్షణ మధ్య పోలిక లేదు: జైరామ్ రమేష్

    భారత్-చైనా: 1962 యుద్ధం, 2020లో ఘర్షణ మధ్య పోలిక లేదు: జైరామ్ రమేష్
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 30, 2023, 03:35 pm 1 నిమి చదవండి
    భారత్-చైనా: 1962 యుద్ధం, 2020లో ఘర్షణ మధ్య పోలిక లేదు: జైరామ్ రమేష్
    విదేశాంగ మంత్రి జైశంకర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన కాంగ్రెస్

    1962లో అప్పటి ప్రధాని నెహ్రూ హయాంలో చైనాతో యుద్ధం తర్వాత భారత్ తన భూభాగాన్ని కోల్పోయిందని, మోదీ హయాంలో కాదని విదేశాంగ మంత్రి జైశంకర్ ఇటీవల చేసిన ప్రకటనపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. 1962లో భారతదేశం తన భూభాగాన్ని రక్షించుకోవడానికి చైనాతో యుద్ధానికి దిగిందని, 2020లో మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చైనా ఆక్రమించుకుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్. ఫలితంగా భారత్ వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని భారత్ కోల్పోయిందన్నారు. అందుకే ఆ రెండు ఘటనల మధ్య పోలిక లేదన్నారు. లద్దాఖ్‌లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమిస్తున్నా మోదీ ప్రభుత్వం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇందుకోసం 'Deny, Distract, Lie and Justify(డీడీఎల్‌జే)' వ్యూహాన్ని అనుసరిస్తోందన్నారు.

    మోదీ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకే కాంగ్రెస్‌పై ఆరోపణలు: రమేశ్

    ప్రాదేశిక పరాభవాన్ని కప్పిపుచ్చేందుకు మోదీ ప్రభుత్వం 'తిరస్కరించడం, దృష్టిని మరల్చడం, అబద్ధం చెప్పడం, సమర్థించడం(డీడీఎల్‌జే)' వ్యూహంతో ముందుకెళ్తోందన్నారు జైరామ్ రమేష్. మోదీ ప్రభుత్వ వైఫల్యం నుంచి దేశ ప్రజల దృష్టిని మరల్చేందుకే విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇటీవల కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేశారన్నారు. 2017లో చైనా రాయబారితో రాహుల్ గాంధీ భేటీపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చేసిన వ్యాఖ్యలపై జైరామ్ రమేష్ ఘాటుగా స్పందించారు. బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అప్పటి భారత రాయబారి అయిన జైశంకర్ ప్రతిపక్ష రిపబ్లికన్ నేతలను ఎలా కలిశారని జైరామ్ రమేష్ ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకులకు దౌత్యవేత్తలను కలిసే అర్హత లేదని స్పష్టం చేశారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    భారతదేశం
    సుబ్రమణ్యం జైశంకర్
    విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి
    చైనా

    తాజా

    మార్చి 24న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం; టీడీపీ అభ్యర్థి అనురాధ విజయం ఎమ్మెల్సీ
    మారుతీ సుజుకి ఏప్రిల్ నుంచి మోడల్ రేంజ్ ధరలను పెంచనుంది ఆటో మొబైల్
    ఉబర్ యాప్ లో తప్పులు కనిపెట్టి 4.6లక్షలు రివార్డు అందుకున్న ఆనంద్ ప్రకాష్ జీవనశైలి

    భారతదేశం

    భారత్ 6G విజన్: భారతదేశంలో త్వరలోనే 6G రానుంది టెక్నాలజీ
    గుజరాత్‌లోని సింహాన్ని తరిమికొట్టిన కుక్కల గుంపు వైరల్ అవుతున్న వీడియో గుజరాత్
    ఢిల్లీ పర్యటనలో ఉన్న ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష నామినీ అజయ్ బంగా ప్రపంచం
    2050కల్లా ఇండియాలో నీటి సమస్యలు: హెచ్చరించిన యునైటెడ్ నేషన్స్ భారతదేశం

    సుబ్రమణ్యం జైశంకర్

    బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాల అంశం; బ్రిటన్ మంత్రికి గట్టిగానే చెప్పిన జైశంకర్ భారతదేశం
    దిల్లీలో జరిగే జీ20 సమావేశానికి చైనా హాజరు చైనా
    మోదీని విమర్శించిన ఇన్వస్టర్ జార్జ్ సోరోస్‌కు జైశంకర్ గట్టి కౌంటర్ అదానీ గ్రూప్
    పాక్‌ను 'ఉగ్రవాద కేంద్రం' అంటే.. చాలా చిన్న పదం అవుతుంది: జైశంకర్ పాకిస్థాన్

    విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి

    భారత్‌లోని విదేశీ రాయబారులకు కేంద్రమంత్రి హోదా; ఇతర దేశాల్లో మన హైకమిషన్లపై ఎందుకంత నిర్లక్ష్యం! దిల్లీ
    టర్కీకి ఆపన్నహస్తం: మొదటి విడతగా ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది, భూకంప సహాయక సామగ్రిని పంపిన భారత్ భారతదేశం
    'పొరుగు దేశాలతో మంచి సంబంధాలను కోరుకుంటున్నాం'.. పాక్, చైనాకు భారత్ గట్టి కౌంటర్ సుబ్రమణ్యం జైశంకర్
    మాల్దీవుల్లో భారత హైకమిషన్‌పై దాడికి కుట్ర.. స్పందించిన విదేశాంగ శాఖ మాల్దీవులు

    చైనా

    Find X6, X6 Pro స్మార్ట్‌ఫోన్‌లను ప్రకటించిన OPPO స్మార్ట్ ఫోన్
    Ernie బాట్ నిరాశపరచడంతో పతనమైన బైడు షేర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    'భారతదేశంలో అరుణాచల్ అంతర్భాగం'; చైనా సరిహద్దును మెక్‌మహన్ రేఖగా గుర్తిస్తూ అమెరికా తీర్మానం అరుణాచల్ ప్రదేశ్
    ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 భారతదేశంలోనే ఉన్నాయి భారతదేశం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023