NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Hardeep Singh Puri: 'ప్రపంచానికి భారత్ మేలు చేసింది' రష్యా నుంచి చమురు కొనుగోలుపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
    తదుపరి వార్తా కథనం
    Hardeep Singh Puri: 'ప్రపంచానికి భారత్ మేలు చేసింది' రష్యా నుంచి చమురు కొనుగోలుపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
    'ప్రపంచానికి భారత్ మేలు చేసింది' రష్యా నుంచి చమురు కొనుగోలుపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

    Hardeep Singh Puri: 'ప్రపంచానికి భారత్ మేలు చేసింది' రష్యా నుంచి చమురు కొనుగోలుపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 08, 2024
    11:11 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పశ్చిమ దేశాల ఆంక్షల వేళ రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేయడంపై అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

    దీనిపై ఇటీవల కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా తాము ప్రపంచానికి మేలు చేశామని, అలా చేయకుంటే అంతర్జాతీయంగా చమురు ధరలు మరింత పెరిగేవి అని ఆయన తెలిపారు.

    వివరాలు 

    చమురు దిగుమతులపై ఎలాంటి ఆంక్షలు లేవు

    ''రష్యా నుంచి చమురు కొనడం ద్వారా భారత్ యావత్ ప్రపంచానికి మేలు చేసింది. ఒకవేళ మేం అలా చేయకుంటే, చమురు ధరలు ఆకాశాన్నంటేవి, బ్యారెల్‌ ధర 200 డాలర్లను చేరేవి. రష్యా నుంచి చమురు దిగుమతులపై ఎలాంటి ఆంక్షలు లేవు, ధరల పరిమితి మాత్రమే ఉంది, దాన్ని భారతీయ సంస్థలు కూడా అనుసరిస్తున్నాయి. ఈ కొనుగోళ్ల కారణంగా భారత్‌పై ఆంక్షలు పడే అవకాశముందని కొందరు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారు. కానీ అదే సమయంలో, ఐరోపా, ఆసియాకు చెందిన చాలా దేశాలు రష్యా నుంచి బిలియన్‌ డాలర్ల విలువైన ముడి చమురు, డీజిల్‌, ఎల్‌ఎన్‌జీ, అరుదైన ఖనిజాలను కొనుగోలు చేశారన్న విషయాన్ని మర్చిపోకూడదు'' అని ఆయన పేర్కొన్నారు.

    వివరాలు 

    లాభం చేకూరే చోట నుండి ఇంధన కొనుగోళ్లు

    "ధరల పరంగా మన చమురు సంస్థలకు లాభం చేకూరే చోట నుండి ఇంధన కొనుగోళ్లు కొనసాగిస్తాం. మన పౌరులకు అందుబాటు ధరల్లో స్థిరమైన ఇంధన వనరులను అందించడమే తమ అగ్ర ప్రాధాన్యం. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ గత మూడేళ్లుగా ఇంధన ధరలు తగ్గుతున్న ఏకైక దేశం మనదే" అని హర్దీప్‌ సింగ్‌ పురి అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025