NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: శ్రామిక శక్తి నుంచి ప్రపంచ శక్తిగా 'భారత్' మారింది : మోదీ
    తదుపరి వార్తా కథనం
    PM Modi: శ్రామిక శక్తి నుంచి ప్రపంచ శక్తిగా 'భారత్' మారింది : మోదీ
    శ్రామిక శక్తి నుంచి ప్రపంచ శక్తిగా 'భారత్' మారింది : మోదీ

    PM Modi: శ్రామిక శక్తి నుంచి ప్రపంచ శక్తిగా 'భారత్' మారింది : మోదీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 01, 2025
    01:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌ ఇప్పుడు ప్రపంచ కర్మాగారంగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

    ఒకప్పుడు ప్రపంచ దేశాలు భారత్‌ను ఓ ఉప శాఖగా చూసేవని, కానీ ప్రస్తుతం ఆ దృక్పథం పూర్తిగా మారిపోయిందని స్పష్టం చేశారు.

    దేశ రాజధానిలో నిర్వహించిన ఎన్‌ఎక్స్‌టీ కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడారు.

    భారత్ గురించి ప్రస్తుతం అంతర్జాతీయంగా చాలా సానుకూల వార్తలు వెలువడుతున్నాయని, అందుకే ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోందని అన్నారు.

    ప్రపంచ ప్రజలు ఇప్పుడు భారత్‌ను మరింతగా తెలుసుకోవాలని, ఇక్కడికి రావాలని ఆకాంక్షిస్తున్నారని చెప్పారు.

    Details

    వేగంగా అభివృద్ధి చెందుతోంది

    గతంలో శ్రామిక శక్తిగా ఉన్న భారత్, ఇప్పుడు ప్రపంచ శక్తిగా మారిపోతోందని ప్రధాని మోదీ అన్నారు.

    సెమీకండక్టర్లు, విమాన వాహక నౌకల తయారీ, ఆటోమొబైల్ రంగంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు.

    అంతేకాక మఖానా, మిల్లెట్‌లు, ఆయుష్ ఉత్పత్తులు, యోగా, ధ్యానం వంటి భారతీయ సంప్రదాయాలను విదేశీయులు కూడా స్వీకరిస్తున్నారని పేర్కొన్నారు.

    Details

    మూడోసారి ఎన్డీఏ విజయంపై ప్రధాని హర్షం

    బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి విజయం సాధించడం, ప్రజలు తమపై ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తోందని ప్రధాని మోదీ అన్నారు.

    నూతనంగా ప్రారంభించిన గ్లోబల్ న్యూస్ ఛానల్ ద్వారా భారత విజయాలను, స్థానిక ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

    భారత్ అభివృద్ధిలో ముందడుగు వేస్తూ అంతర్జాతీయ కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తోందని మోదీ చెప్పారు.

    ఇటీవల మహాకుంభమేళా ఘనంగా నిర్వహించడంతో, భారత నిర్వహణానైపుణ్యాలు, ఆవిష్కరణలు ప్రపంచానికి మరోసారి తెలిసాయని పేర్కొన్నారు.

    తమ పాలనలో కాలం చెల్లిన అనేక చట్టాలను రద్దు చేసి, కొత్త చట్టాలను తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ఇండియా

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    నరేంద్ర మోదీ

    People's Budget:"ప్రజల బడ్జెట్,పొదుపు,పెట్టుబడి పెరుగుతాయి".. బడ్జెట్‌పై స్పందించిన పీఎం మోదీ భారతదేశం
    Trump-Modi: ఫిబ్రవరి 13న వాషింగ్టన్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ చర్చలు  డొనాల్డ్ ట్రంప్
    PM Modi: మహ కుంభమేళాలో ప్రధాని మోదీ పాల్గొనే పూర్తి షెడ్యూల్ ఇదే! ఉత్తర్‌ప్రదేశ్
    Parliament Budget Session:  25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చాం: మోదీ  భారతదేశం

    ఇండియా

    CDSCO: సీడీఎస్‌సీఓ నివేదిక.. నాణ్యత పరీక్షలలో విఫలమైన 135 రకాల మందులు  బిజినెస్
    India-Indonesia: రక్షణ ఉత్పత్తుల తయారీలో భారత్‌, ఇండోనేషియా సహకారం ఇండోనేషియా
    Mahakumbh Mela: కోట్లాది భక్తులతో కుంభమేళా.. 'మియవాకి' టెక్నిక్‌ సాయంతో స్వచ్ఛమైన గాలి ఉత్తర్‌ప్రదేశ్
    Dr.K.M Cherian: ప్రముఖ భారత హార్ట్ సర్జన్ ఎం.చెరియన్ కన్నుమూత భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025