LOADING...
Top Military Spender: ప్రపంచ రక్షణ వ్యయంలో ఐదో స్థానంలో భారత్
ప్రపంచ రక్షణ వ్యయంలో ఐదో స్థానంలో భారత్

Top Military Spender: ప్రపంచ రక్షణ వ్యయంలో ఐదో స్థానంలో భారత్

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 28, 2026
11:11 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా రక్షణ రంగంపై అత్యధికంగా వ్యయం చేసే దేశాల జాబితాలో భారత్ ఐదో స్థానాన్ని సంపాదించింది. 2025 సంవత్సరంలో మన దేశం ఈ రంగంపై 92.1 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. అమెరికా,చైనా,రష్యా,జర్మనీ దేశాలు భారత్ కంటే ముందున్నాయి. ఈ విషయాలను స్టాక్‌హోం అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం,2025లో ప్రపంచ రక్షణ వ్యయం 2.9శాతం పెరిగి మొత్తం 2,887 బిలియన్ డాలర్లకు చేరింది. అదే సమయంలో భారత్ తన రక్షణ ఖర్చును పెంచి 92.1బిలియన్ డాలర్లకు తీసుకెళ్లింది. ఇది 2024తో పోలిస్తే 8.9శాతం అధికం.ఈ పెరుగుదలతో ప్రపంచంలో అత్యధికంగా రక్షణ ఖర్చు చేసే దేశాల జాబితాలో భారత్ ఐదో స్థానంలో నిలిచింది.

వివరాలు 

31వ స్థానంలో పాక్ 

దేశాల వారీగా పరిశీలిస్తే, 954 బిలియన్ డాలర్లతో అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. 336 బిలియన్ డాలర్లతో చైనా రెండో స్థానంలో ఉంది. ఉక్రెయిన్‌తో యుద్ధ పరిస్థితుల కారణంగా రష్యా 190 బిలియన్ డాలర్లు ఖర్చు చేసి మూడో స్థానంలో నిలిచింది. 114 బిలియన్ డాలర్లతో జర్మనీ నాల్గో స్థానాన్ని సంపాదించింది. 2025లో ప్రపంచ రక్షణ వ్యయం పెరగడంలో ఐరోపా దేశాల పాత్ర కీలకంగా నిలిచింది. ఆ ప్రాంతం తన ఖర్చును 14 శాతం పెంచి 864 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లింది. మరోవైపు పాకిస్తాన్ కూడా తన రక్షణ వ్యయాన్ని 11 శాతం పెంచింది. 11.9 బిలియన్ డాలర్ల ఖర్చుతో ఆ దేశం ఈ జాబితాలో 31వ స్థానంలో నిలిచింది.

Advertisement