Page Loader
Operation Sindoor: మే 12న భారత్-పాక్ మధ్య హాట్‌లైన్‌లో చర్చలు
మే 12న భారత్-పాక్ మధ్య హాట్‌లైన్‌లో చర్చలు

Operation Sindoor: మే 12న భారత్-పాక్ మధ్య హాట్‌లైన్‌లో చర్చలు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 11, 2025
01:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌-పాక్‌ మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యాన్ని కొనసాగిస్తూ, రెండు దేశాల మధ్య సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు హాట్‌లైన్‌లో కీలక చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల్లో భారత్‌, పాకిస్థాన్‌ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్‌ (DGMO)లు పాల్గొననున్నారు. కలహ వాతావరణాన్ని తగ్గించడంతో పాటు కాల్పుల విరమణ కొనసాగింపు వంటి కీలక అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. శనివారం మధ్యాహ్నం 3.35 గంటల సమయంలో పాకిస్థాన్‌ డీజీఎంవో, భారత్‌ డీజీఎంవోతో హాట్‌లైన్‌ ద్వారా మాట్లాడారు.

Details

చర్చలకు ప్రాధాన్యత

ఈ సందర్భంగా కాల్పుల విరమణ ప్రతిపాదనను ముందుంచి, వెంటనే అమలు చేయాలని కోరారు. దీనికి అనుగుణంగా అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. అయితే విరమణ అమలులోకి వచ్చిన కొద్దిగంటలకే పాక్‌ సైన్యం దీనిని ఉల్లంఘించిన సంగతి గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో సోమవారం జరగనున్న DGMOల చర్చలకు ప్రాధాన్యత ఏర్పడింది.