Page Loader
Operation Sindoor: ఉగ్రవాదంపై భారత్‌ ఆందోళన.. యూకే మంత్రితో జైశంకర్‌ కీలక చర్చలు 
ఉగ్రవాదంపై భారత్‌ ఆందోళన.. యూకే మంత్రితో జైశంకర్‌ కీలక చర్చలు

Operation Sindoor: ఉగ్రవాదంపై భారత్‌ ఆందోళన.. యూకే మంత్రితో జైశంకర్‌ కీలక చర్చలు 

వ్రాసిన వారు Jayachandra Akuri
May 09, 2025
04:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆపరేషన్‌ సిందూర్‌ వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో, కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ యూకే విదేశాంగ మంత్రి డేవిడ్‌ ల్యామితో కీలక చర్చలు జరిపారు. ఈ సమావేశానికి భారత్‌ తరఫున ఐఎంఎఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పరమేశ్వరన్‌ అయ్యర్‌ హాజరయ్యారు. పాకిస్థాన్ ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పిస్తోందన్న అంశాన్ని భారత్‌ గట్టిగా ప్రస్తావించింది. ఆ దేశానికి నిధులు సమకూరేలా చేసే చర్యలపై ఆందోళన వ్యక్తం చేసింది. టెర్రరిజాన్ని అణచివేయాలన్న మనస్సు పాకిస్తాన్‌ చూపడం లేదని భారత్‌ స్పష్టం చేసింది. బుధవారం బ్రిటన్‌ పార్లమెంటులో పహల్గాం ఘటన, భారత్‌ ప్రతిచర్యగా చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ అంశాలు చర్చకు వచ్చాయి. ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్‌, పాక్‌లు సంయమనం పాటించాలంటూ ఎంపీలు బ్రిటన్‌ ప్రభుత్వాన్ని కోరారు.

Details

ఉద్రికత్తలు

సమస్యలను దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలని ప్రధాని కీర్‌ స్టార్మర్‌ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఎంపీ హమిష్‌ ఫాక్నర్‌ చర్చ ప్రారంభించారు. బ్రిటన్‌కు భారత్‌, పాక్‌లతో సమీప సంబంధాలున్నాయని, పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తున్నట్లు ఫాక్నర్‌ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, భారత్‌ పాక్‌ను అంతర్జాతీయ వేదికలపై ఒడిగడుతున్నది. ఇప్పటికే ఆపరేషన్‌ సిందూర్‌ సంబంధిత విషయాలను అమెరికా సహా మిత్రదేశాలకు తెలియజేసింది. నిన్న రాత్రి విదేశాంగ మంత్రి జైశంకర్‌, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ఫోన్‌లో మాట్లాడారు. ఉగ్రవాదానికి ఏ మాత్రం సహనం ఉండదని, అవసరమైతే కఠిన నిర్ణయాలకు వెనుకాడబోమని ఆ సందర్భంలో రూబియో తెలిపారు.