NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / high-speed train: బెంగళూరులో భారతదేశపు మొదటి తొలి హైస్పీడ్‌ రైలు తయారీకి రంగం సిద్ధం 
    తదుపరి వార్తా కథనం
    high-speed train: బెంగళూరులో భారతదేశపు మొదటి తొలి హైస్పీడ్‌ రైలు తయారీకి రంగం సిద్ధం 
    బెంగళూరులో భారతదేశపు మొదటి తొలి హైస్పీడ్‌ రైలు తయారీకి రంగం సిద్ధం

    high-speed train: బెంగళూరులో భారతదేశపు మొదటి తొలి హైస్పీడ్‌ రైలు తయారీకి రంగం సిద్ధం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 20, 2024
    02:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌లో తొలి హైస్పీడ్‌ రైలు తయారీకి బెంగళూరులో ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ రైలును ముంబయి-అహ్మదాబాద్‌ మధ్య ఉన్న హైస్పీడ్‌ రైలు కారిడార్‌లో ఉపయోగించనున్నారు.

    సెప్టెంబర్ 5న ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ICF) ఈ రైళ్ల తయారీకి సంబంధించిన టెండర్‌ను విడుదల చేసింది.

    ఈ రైళ్లు గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగివుండాలని పేర్కొన్నారు.

    బిడ్ల దాఖలుకు చివరి తేదీ సెప్టెంబర్ 19గా నిర్ణయించగా, బీఈఎంల్‌ ఒక్కటే దరఖాస్తు సమర్పించింది.

    ఐసీఎఫ్‌ జనరల్ మేనేజర్‌ యు. సుబ్బారావ్‌ ప్రకారం, త్వరలోనే టెండర్‌ ప్రక్రియ పూర్తికానుంది. రైలు తయారీకి రెండు సంవత్సరాల వ్యవధి ఉండనుంది.

    వివరాలు 

    ఈ ప్రాజెక్టుకు సుమారు రూ. 1.1 లక్షల కోట్ల వ్యయం 

    ఈ రైలు ఖరీదు సుమారు రూ. 200 నుండి రూ. 250 కోట్ల మధ్యలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

    508 కిలోమీటర్ల ముంబయి-అహ్మదాబాద్‌ మార్గంలో నిర్మించిన హైస్పీడ్‌ కారిడార్‌లో ఈ రైళ్లు నడిపే ప్రణాళికలు ఉన్నాయి.

    ఈ ప్రాజెక్టుకు సుమారు రూ. 1.1 లక్షల కోట్ల వ్యయం అంచనా వేస్తున్నారు. అంతకు ముందు, జపాన్‌లో తయారుచేసిన రైళ్లను ఈ మార్గంలో నడిపించాలని అనుకున్నా,అధిక వ్యయం కారణంగా దేశీయంగా నిర్మించాలనే నిర్ణయం తీసుకున్నారు.

    ఈ ప్రాజెక్టులో బీఈఎంల్‌, మేధా సెర్వో డ్రైవ్స్‌ కలిసి పని చేయనున్నాయి.

    ఐరోపా ప్రమాణాలకు అనుగుణంగా ఈ రైలు రూపొందనుంది. మేధా కంపెనీ హైస్పీడ్‌ ప్రొపెల్షన్‌ వ్యవస్థలను తయారు చేస్తుంది, ఇవే ఇప్పటికే వందే భారత్‌ రైళ్లలో ఉపయోగిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బెంగళూరు

    తాజా

    Mango Chutney: సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఆమ్ చట్నీ.. మీరూ ఓసారి ట్రై చేయండి లేకపోతే మిస్‌యిపోతారు!తయారీ విధానం ఇదిగో.. వంటగది
    Mini Kashmir: కశ్మీర్‌కు బదులుగా ఈ మినీ కశ్మీర్‌కెళ్లండి.. ఇదే రైట్ టైమ్! జమ్ముకశ్మీర్
    Ravindra Jadeja: జడేజాకు టెస్ట్ సారథ్య బాధ్యతలు ఇవ్వాలి : అశ్విన్ జడేజా
    P Chidambaram:: 'ఇండియా అలయన్స్ వేస్ట్'.. 2029 లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం  ఇండియా కూటమి

    బెంగళూరు

    Rameshwaram Cafe Blast: అనుమానితుడి మొదటి ముసుగు లేని ఫోటో ఇదే.. భారతదేశం
    Karnataka: ఫామ్‌హౌస్‌లో 32 పుర్రెలు.. యజమాని అరెస్ట్  కర్ణాటక
    Bengaluru Shocker: బెంగళూరులో దారుణం.. కుళ్లిన స్థితిలో యువతి నగ్న ముతదేహం  హత్య
    Bengaluru: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ  తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025