NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Hydrogen Train : భారత్‌లో తొలి హైడ్రోజన్‌ రైలు.. ట్రయల్‌ రన్‌ ప్రారంభం 
    తదుపరి వార్తా కథనం
    Hydrogen Train : భారత్‌లో తొలి హైడ్రోజన్‌ రైలు.. ట్రయల్‌ రన్‌ ప్రారంభం 
    భారత్‌లో తొలి హైడ్రోజన్‌ రైలు.. ట్రయల్‌ రన్‌ ప్రారంభం

    Hydrogen Train : భారత్‌లో తొలి హైడ్రోజన్‌ రైలు.. ట్రయల్‌ రన్‌ ప్రారంభం 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 18, 2024
    12:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో మొదటి హైడ్రోజన్‌ ట్రైన్‌ రాబోతుంది. డిసెంబర్‌ చివర్లో ట్రయల్‌ రన్‌ జరగనుండగా, వచ్చే ఏడాది ఇది అందుబాటులోకి రానుంది.

    తొలిసారిగా ఈ ట్రైన్ జింద్‌ - సోనిపట్‌ మార్గంలో నడిచే అవకాశముంది. దిల్లీలోని డివిజన్‌లోని 89 కిలోమీటర్ల మార్గంలో ఈ రైలు ప్రయాణించనుంది.

    భారత ప్రభుత్వం 2030 నాటికి కార్బన్‌ ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో హైడ్రోజన్‌ రైళ్లను ప్రవేశపెట్టాలని భావించింది.

    ప్రస్తుతం భారత రైల్వేలో ఎలక్ట్రిక్‌, డీజిల్‌ రైళ్లు నడుస్తున్నాయి. అయితే రైల్వే శాఖ కొత్తగా హైడ్రోజన్‌ ఆధారిత రైళ్లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.

    ఈ ప్రాజెక్టు 'హైడ్రోజన్‌ ఫర్‌ హెరిటేజ్' అని పిలవనున్నారు. ఈ రైళ్ల వల్ల పర్యావరణానికి అనుకూలంగా ఉండి, కాలుష్యం లేకుండా ప్రయాణం సాగుతుంది.

    Details

    భారీగా రైల్వే శాఖ పెట్టుబడులు

    2030 నాటికి భారతీయ రైల్వేలు నెట్‌ జీరో కార్బన్‌ ఎమిటర్‌గా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి, రైల్వే శాఖ భారీగా పెట్టుబడులు చేస్తోంది.

    ఈ ఏడాది బడ్జెట్‌లో 35 హైడ్రోజన్‌ రైళ్ల కోసం రూ.2800 కోట్లు కేటాయించగా, హెరిటేజ్ మార్గాల్లో హైడ్రోజన్‌ మౌలిక సదుపాయాల కోసం రూ.600 కోట్లు విడుదల చేసింది.

    అదేవిధంగా డీజిల్‌ ఆధారిత డెము రైళ్లను హైడ్రోజన్‌తో నడపడానికి కూడా ఒక ప్రాజెక్టు ప్రారంభించింది. దీని కోసం రూ.111.83 కోట్ల కాంట్రాక్ట్‌ను అప్పగించింది.

    హైడ్రోజన్‌ రైళ్లు పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించనున్నాయి. వీటిలో హైడ్రోజన్‌ ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది, రైల్వేలు సోలార్‌ ప్లాంట్లను, చెట్ల నాట్లును కూడా ప్రోత్సహించనున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    రైల్వే బోర్డు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    భారతదేశం

    Highest Plastic Pollution: ప్లాస్టిక్ కాలుష్యంలో భారతదేశం నిజంగానే మొదటి స్థానంలో ఉందా? అధ్యయనంలో సంచలన విషయాలు!  లైఫ్-స్టైల్
    IAF transport aircraft: వాయుసేనకు ఎంటీఏ విమానాలు.. టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్, లాక్‌హీడ్‌ ఒప్పందం  భారతదేశం
    Wholesale inflation: టోకు ద్రవ్యోల్బణం ఆగస్ట్‌లో 1.31 శాతానికి తగ్గింది  వ్యాపారం
    Artillery shells: రష్యాపైకి భారత్‌  మందుగుండు సామాగ్రి.. ఉక్రెయిన్‌కు విక్రయించలేదంటున్న ఢిల్లీ..! ఉక్రెయిన్-రష్యా యుద్ధం

    రైల్వే బోర్డు

    రైల్వే బోర్డు తొలి మహిళా సీఈఓగా జయవర్మ సిన్హా  జయవర్మ సిన్హా
    రైల్వే ఉద్యోగులకు కేంద్రం గుడ్​ న్యూస్​.. ఎంత శాతం డీఏ పెరిగిందో తెలుసా రైల్వే స్టేషన్
    IRCTC Site-App Down: IRCTC డౌన్.. యాప్, వెబ్‌సైట్‌ను ఉపయోగించడంలో ఇబ్బంది  టెక్నాలజీ
    Special Trians: తెలుగు రాష్ట్రాలకు రైల్వే గుడ్ న్యూస్.. వీకెండ్ లో ఈ నగరాల మధ్య 8 స్పెషల్ ట్రైన్స్  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025