NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Hyperloop: 3 గంటల్లోపే హైదరాబాద్ టూ దిల్లీ.. హైపర్‌లూమ్ రవాణా వ్యవస్థకు భారత్ సిద్ధం..
    తదుపరి వార్తా కథనం
    Hyperloop: 3 గంటల్లోపే హైదరాబాద్ టూ దిల్లీ.. హైపర్‌లూమ్ రవాణా వ్యవస్థకు భారత్ సిద్ధం..
    హైపర్‌లూమ్ రవాణా వ్యవస్థకు భారత్ సిద్ధం..

    Hyperloop: 3 గంటల్లోపే హైదరాబాద్ టూ దిల్లీ.. హైపర్‌లూమ్ రవాణా వ్యవస్థకు భారత్ సిద్ధం..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 25, 2025
    05:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశం ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ అమలుకు సిద్ధమవుతోంది.

    ఈ నేపథ్యంలో, దేశంలో మొట్టమొదటి ''హైపర్‌లూప్'' టెస్ట్ ట్రాక్‌ను మరింత అభివృద్ధి చేయడానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్‌కు భారతీయ రైల్వేలు అదనంగా 1 మిలియన్ డాలర్లు మంజూరు చేయనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం ప్రకటించారు.

    'ఆవిష్కార్'' పేరుతో అభివృద్ధి చేయబడుతున్న 422 మీటర్ల పొడవైన ఈ ట్రాక్‌లో, గంటకు 1000 కి.మీ.కు పైగా వేగంతో రైళ్లు ప్రయాణించేందుకు వీలు కలుగుతుంది.

    ఇది ప్రత్యేకమైన వాక్యూమ్ ట్యూబ్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది.

    వివరాలు 

    అద్భుత వేగంతో ప్రయాణ మార్గం! 

    ఒక విధంగా చెప్పాలంటే, హైదరాబాద్ - న్యూఢిల్లీ మధ్య దూరం దాదాపు 1700 కి.మీ. ఈ హైపర్‌లూప్ టెక్నాలజీ ఉపయోగించి, ఈ మార్గాన్ని కేవలం మూడు గంటల్లోనే చేరుకోగలుగుతుంది.

    ఈ ప్రాజెక్టుకు టెస్ట్ ట్రాక్ నిర్మాణం, అభివృద్ధిలో లార్సెన్ & టూబ్రో (ఎల్ అండ్ టి) కన్స్ట్రక్షన్, ఆర్సెలర్ మిట్టల్, హిందాల్కో ఇండస్ట్రీస్ వంటి ప్రముఖ పరిశ్రమ సంస్థల మద్దతు లభించింది.

    భవిష్యత్తులో చెన్నై - బెంగళూరు మధ్య హైపర్‌లూప్ కారిడార్ రూపొందించేందుకు ప్రతిష్టాత్మక ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

    వివరాలు 

    బుల్లెట్ రైలు కన్నా వేగవంతమైన హైపర్‌లూప్! 

    ప్రస్తుత బుల్లెట్ రైళ్ల కంటే వేగవంతంగా పని చేసే ఈ హైపర్‌లూప్ టెక్నాలజీ, దేశంలోని రవాణా మౌలిక సదుపాయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది.

    అత్యంత వేగవంతమైన, సమర్థవంతమైన, స్థిరమైన ప్రయాణ పద్ధతిగా మారబోతోంది.

    ఇది ప్రధాన నగరాలు, పట్టణాల మధ్య కనెక్టివిటీని పెంచడంతో పాటు, భారతదేశాన్ని ప్రపంచ వేదికపై మరో స్థాయికి తీసుకెళ్లనుంది.

    వివరాలు 

    హైపర్‌లూప్ అంటే ఏమిటి? 

    ఈ హైపర్‌లూప్ టెక్నాలజీను"ఐదవ రవాణా విధానం"అని కూడా అంటారు.ఇది చాలా దూరాలను అత్యద్భుత వేగంతో అధిగమించే అత్యాధునిక రవాణా వ్యవస్థ.

    ఇందులో వాక్యూమ్ ట్యూబ్‌లలో ప్రయాణించే ప్రత్యేక క్యాప్సూల్స్ ఉంటాయి.క్యాప్సూల్ విద్యుదయస్కాంత శక్తితో పైకి లేచి ప్రయాణిస్తుంది,దీంతో ఘర్షణ,గాలిని పూర్తిగా తొలగించగలుగుతుంది.

    ఈ విధంగా,హైపర్‌లూప్ మాక్ 1.0(గంటకు 1225 కి.మీ.)వరకు వేగాన్ని చేరుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

    హైపర్‌లూప్ వాతావరణ నిరోధకతను కలిగి ఉంటుంది. ఇది విమానాల కంటే రెండింతల వేగంతో, తక్కువ విద్యుత్ వినియోగంతో నిరంతరం 24 గంటలపాటు పనిచేయగలదు.

    భారత రవాణా రంగంలో కొత్త విప్లవం!

    ఈ అత్యాధునిక రవాణా విధానం భారతదేశంలోని ప్రధాన నగరాలను మరింత సమర్థవంతంగా అనుసంధానించడంతో పాటు,భవిష్యత్తులో గ్లోబల్ లీడర్‌గా భారత్‌ను నిలబెట్టేందుకు సహాయపడనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అశ్విని వైష్ణవ్

    తాజా

    Amaravati: అమరావతిలో గూగుల్‌ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు.. 143 ఎకరాల భూమి కేటాయించనున్న ప్రభుత్వం  అమరావతి
    Elon Musk: 80శాతం మద్దతు.. మస్క్ కొత్త పార్టీకి 'ది అమెరికా పార్టీ' గా నామకరణం? ఎలాన్ మస్క్
    UPSC exams: ఆధార్‌ ధృవీకరణతో యూపీఎస్‌సీ దరఖాస్తు మరింత సులువు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
    KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)

    అశ్విని వైష్ణవ్

    'అమృత్ భారత్ పథకం' కింద ఆంధ్రప్రదేశ్‌లో 72 రైల్వే స్టేషన్ల అభివృద్ధి: కేంద్రం ఆంధ్రప్రదేశ్
    Odisha train accident: అంతా నిమిషాల్లోనే జరిగిపోయింది; అసలు మూడు ట్రైన్లు ఎలా ఢీకొన్నాయంటే?  ఒడిశా
    ఒడిశా రైలు ప్రమాదంపై రాజకీయ దుమారం; సీబీఐ విచారణను కోరిన రైల్వే శాఖ  రైలు ప్రమాదం
    ఒడిశా విషాదం జరిగిన ట్రాక్‌పై 51గంటల తర్వాత తొలి రైలు ప్రయాణం  రైలు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025