
Vande Bharat Sleeper Express: ఢిల్లీ-పాట్నా మధ్య తొలి వందేభారత్ స్లీపర్ రైలు
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ రైల్వే శాఖ త్వరలో వందేభారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించనుంది. ఈ ప్రత్యేక రైలు ఢిల్లీ నుండి పాట్నా వరకు ప్రయాణించనుంది. ఈ రైలు ప్రయాగ్రాజ్ మీదుగా వెళ్తుందని రైల్వే శాఖ తెలిపింది. అయితే, తాజా రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ రైలు ప్రారంభాన్ని త్వరితగతిన అమలు చేయాలని నిర్ణయించబడింది. ప్రస్తుతం బీహార్ అసెంబ్లీ ప్రస్తుత పదవీకాలం నవంబర్ 22న ముగియనుంది. అదే రోజు ఎన్నికల కమిషన్ ద్వారా ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంటుంది. అందుకే, నవంబర్ 15 లోపు ఎన్నికలు జరగడం ఖాయంగా భావిస్తున్నారు. ఇప్పటి వరకు వందేభారత్ రైళ్లలో డే జర్నీకి మాత్రమే ప్రత్యేక గుర్తింపు వచ్చింది.
వివరాలు
180 కిలోమీటర్ల వేగంతో..
కానీ, కొత్తగా ప్రారంభించబోయే వందేభారత్ స్లీపర్ రైలు రాత్రి ప్రయాణంలో కూడా ప్రయాణికులకు సౌకర్యాన్ని కల్పిస్తుంది. దీపావళి సీజన్ సందర్భంగా ఆ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. వందేభారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ నుండి పాట్నా వరకు ప్రయాగ్రాజ్ మార్గాన్ని అనుసరిస్తూ కేవలం 11.5 గంటల్లో తన ప్రయాణాన్ని పూర్తిచేస్తుంది. ఇదే మార్గంలో వెళ్లే రాజధాని ఎక్స్ప్రెస్కు 23 గంటల సమయం పడుతోంది. BEML కంపెనీ ఈ వందేభారత్ స్లీపర్ రైలును తయారు చేస్తోంది. ప్రస్తుత రాజధాని ఎక్స్ప్రెస్, తేజస్ ఎక్స్ప్రెస్ రైళ్ల కంటే అధునాతనమైన సాంకేతికతతో రూపొందించబడిన ఈ స్లీపర్ రైలు వినూత్నంగా ఉంటుందనే భావన వ్యక్తమవుతోంది. ఈ రైలు సుమారు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
వివరాలు
సెన్సార్ ఆధారిత ఇంటర్ కమ్యూనికేషన్ డోర్లు
ఒక్క వందేభారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్లో మొత్తం 16 కోచ్లు ఉంటాయి. వీటిలో 11 ఏసీ-3 టైర్ కోచ్లు, రెండు ఏసీ-2 టైర్ కోచ్లు, ఒక ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్ ఉంటాయి. ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని కల్పించేలా సెన్సార్ ఆధారిత ఇంటర్ కమ్యూనికేషన్ డోర్లు కూడా అమర్చబడ్డాయి.