Page Loader
S Jaishankar: భారత ప్రయోజనాలే ప్రాధాన్యం.. వాణిజ్య ఒప్పందాలపై జైశంకర్ స్పష్టత
భారత ప్రయోజనాలే ప్రాధాన్యం.. వాణిజ్య ఒప్పందాలపై జైశంకర్ స్పష్టత

S Jaishankar: భారత ప్రయోజనాలే ప్రాధాన్యం.. వాణిజ్య ఒప్పందాలపై జైశంకర్ స్పష్టత

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 23, 2025
04:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ వాణిజ్య ఒప్పందాల ప్రాధాన్యతను ప్రస్తావించారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల్లో వాణిజ్య ఒప్పందాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు. ఈ ఒప్పందాల ద్వారా భారతదేశం లాభాలను గణనీయంగా పొందవచ్చని తెలిపారు.

Details

ప్రస్తుతం చర్చలు జరుగుతున్న కీలక వాణిజ్య ఒప్పందాలు

1. ఐరోపా సమాఖ్య (EU) - స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కోసం చర్చలు. 2. యునైటెడ్ కింగ్‌డమ్ (UK) - ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు. 3. అమెరికా - కీలక ద్వైపాక్షిక ఒప్పందానికి చర్చలు. 4. న్యూజిలాండ్ - కొత్త వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభం. 5. గల్ఫ్‌, పశ్చిమ దేశాలు - ఇప్పటికే మిగులు వాణిజ్యాన్ని సాధించిన ఒప్పందాలు. ప్రయోజనాలను జాగ్రత్తగా లెక్కించాలి జైశంకర్‌ మాట్లాడుతూ ఒప్పందాలు తీసుకోవడం లేదా వద్దనుకోవడం వల్ల కలిగే లాభనష్టాలను జాగ్రత్తగా గమనించాలని సూచించారు. సున్నితమైన టెక్నాలజీ విషయంలో ఇరు పక్షాలకు ప్రయోజనాలు కలిగేలా ఒప్పందాలు కుదరాలన్నారు.

Details

భారత ప్రాధాన్యత

భవిష్యత్తులో భారత ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. గతంలో ప్రధానంగా ఆసియాన్‌ దేశాలతో ఒప్పందాలు చేసుకున్న భారత్, ఇప్పుడు పశ్చిమ దేశాలపై దృష్టి పెట్టిందని వివరించారు. గత ఒప్పందాల్లో గల్ఫ్‌, పశ్చిమ దేశాలతో మిగులు వాణిజ్యం నమోదైనా ఆసియాన్ ఒప్పందాల్లో పోటీ తీవ్రంగా ఉందని తెలిపారు. భారత ప్రభుత్వం దృష్టి ప్రతీకార సుంకాల అమలు సమయం దగ్గర పడుతున్న తరుణంలో భారత ప్రభుత్వం వాణిజ్య ఒప్పందాల చర్చలను వేగవంతం చేస్తోంది. దీని ద్వారా భారత దిగుమతులు, ఎగుమతులకు గణనీయంగా లాభాలు చేకూరే అవకాశముందని జైశంకర్‌ అభిప్రాయపడ్డారు.