NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రేపు ముంబైలో ప్రతిపక్షాల 'ఇండియా' కూటమి సమావేశం.. 27 పార్టీల హాజరు
    తదుపరి వార్తా కథనం
    రేపు ముంబైలో ప్రతిపక్షాల 'ఇండియా' కూటమి సమావేశం.. 27 పార్టీల హాజరు
    రేపు ముంబైలో ప్రతిపక్షాలు 'ఇండియా' కూటమి సమావేశం.. 27 పార్టీల హాజరు

    రేపు ముంబైలో ప్రతిపక్షాల 'ఇండియా' కూటమి సమావేశం.. 27 పార్టీల హాజరు

    వ్రాసిన వారు Stalin
    Aug 30, 2023
    04:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయేను ఓడించేందుకు లక్ష్యంగా ప్రతిపక్షాల ఇండియా (ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్) కూటమి గురువారం మూడోసారి సమావేశం అవుతోంది.

    ముంబై వేదికగా ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో ప్రతిపక్షాల సమావేశం జరగనుంది.

    రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పొత్తులతో పాటు, లోగో, సీట్ల పంపకం వంటి అంశాలపై చర్చించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

    కూటమి సమన్వయ కమిటీ, లోగోను ప్రకటించే అవకాశం తెలుస్తోంది.

    కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ రూపొందించడానికి, దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించడానికి, సీట్ల భాగస్వామ్యానికి ఉమ్మడి ప్రణాళికలను రూపొందించడానికి కొన్ని ప్యానెల్‌లను ప్రకటించనున్నట్లు సమాచారం.

    ముంబైలో సమావేశాలకు 27పార్టీల నుంచి 62 మంది ప్రతినిధులు హాజరుకాబోతున్నారు.

    ముంబై

    కూటమి కన్వీనర్‌పై చర్చించే అవకాశం

    మోదీ పాలనను ఎండగట్టడానికి, దేశ ప్రజలకు ప్రత్యామ్నాయాన్ని అందించడానికి ముంబై సమావేశం స్పష్టమైన రోడ్‌మ్యాప్‌‌ను అందిస్తుందని ఆర్జేడీ నేత మనోజ్ ఝా చెప్పారు.

    అలాగే ఇండియూ కూటమి సమన్వయం కోసం ఒక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలని ఆయా పార్టీలు భావిస్తున్నాయి.

    దిల్లీలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా కూటమికి నేతృత్వం వహించేందుకు కన్వీనర్‌గా ఎవరు ఉండాలనే దానిపై కూడా సభ్యులు చర్చించనున్నారు.

    ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భవిష్యత్ ప్రణాళిలను రూపొందించడటమే లక్ష్యంగా ఎజెండాగా ఉంటుందని ఆర్డేజీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు.

    సమావేశాల కోసం మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ నేతలు విస్తృతంగా సన్నాహాలు చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇండియా
    ప్రతిపక్షాలు
    ముంబై
    తాజా వార్తలు

    తాజా

    Tabu: మళ్లీ వార్తల్లో కృష్ణజింక కేసు.. సైఫ్‌, టబు, నీలం, సోనాలీపై విచారణ కొనసాగుతోంది బాలీవుడ్
    Neeraj Chopra: 90 మీటర్ల మార్క్ దాటిన నీరజ్‌ చోప్రా.. అభినందనలు తెలిపిన నరేంద్ర మోదీ నీరజ్ చోప్రా
    ChatGPT: చాట్‌జీపీటీలో నిమిషాల్లో కోడింగ్‌, బగ్స్‌ ఫిక్స్‌ చేసే ఏఐ టూల్ చాట్‌జీపీటీ
    IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ! ఐపీఎల్

    ఇండియా

    INDIA alliance: 'జీతేగా భారత్'- ప్రతిపక్షాల 'ఇండియా' కుటమికి ట్యాగ్‌లైన్ ఇదే  ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్
    Netflix: వినియోగదారులకు భారీ షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్.. ఇకపై పాస్ వర్డ్ షేరింగ్‌కు నో ఛాన్స్ నెట్ ఫ్లిక్స్
    వెస్టిండీస్‌పై విరాట్ సెంచరీ: విదేశాల్లో తిరుగులేని రికార్డు; ఇప్పటివరకు ఎన్ని సెంచరీలు చేసాడంటే?  విరాట్ కోహ్లీ
    మణిపూర్‌ పరిస్థితిపై ప్రధాని మోదీ మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్: ఈ నెల 24న నిరసన మణిపూర్

    ప్రతిపక్షాలు

    Opposition Meeting: నేడు బెంగళూరలో ప్రతిపక్షాల నేతల సమావేశం; 2024 ఎన్నికల రోడ్‌మ్యాప్‌పై ఫోకస్ ఎన్నికలు
    Opposition 26 vs NDA 38: పోటాపోటీగా అధికార, ప్రతిపక్షాల సమావేశాలు దిల్లీ
    PM Modi: 'అదొక అవినీతిపరుల సమ్మేళనం'; ప్రతిపక్షాల సమావేశంపై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    Opposition Meeting: 26 ప్రతిపక్షాల కూటమి పేరు 'I-N-D-I-A' గా ఖరారు కాంగ్రెస్

    ముంబై

    వందేభారత్ వచ్చేస్తోంది! ఇక ముంబై నుంచి గోవాకు 7 గంటల 50 నిమిషాల్లోనే వెళ్లొచ్చు  వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    ఫుడ్ బిల్లు విషయంలో పుట్టినరోజు వేడుకల్లో గొడవ; యువకుడిని హత్య చేసిన నలుగురు స్నేహితులు  పుట్టినరోజు
    ముంబై: హాస్టల్ గదిలో శవమై కనిపించిన విద్యార్థిని; రైలు పట్టాల వద్ద నిందితుడి మృతదేహం  హత్య
    ముంబై: జీవిత భాగస్వామిని ముక్కలుగా నరికి, శరీర భాగాలను కుక్కర్‌లో ఉడకబెట్టాడు  మహారాష్ట్ర

    తాజా వార్తలు

    చంద్రయాన్ -3 మూడు లక్ష్యాల్లో రెండు పూర్తి.. ఆఖరి టార్గెట్‌పై మిషన్ ఫోకస్    చంద్రయాన్-3
    అసోం బీజేపీ ఎంపీ ఇంట్లో 10ఏళ్ల బాలుడి మృతదేహం.. అసలేమైంది?  అస్సాం/అసోం
    అమెరికా: నల్లజాతీయులే లక్ష్యంగా కాల్పులు.. ముగ్గురు మృతి అమెరికా
    పశ్చిమ బెంగాల్‌: బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఏడుగురు మృతి పశ్చిమ బెంగాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025