NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Hydro projects:పాకిస్తాన్ కు వరుసగా షాకులిస్తున్న కేంద్రం.. జల విద్యుత్ ప్రాజెక్టులపై పని ప్రారంభం 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Hydro projects:పాకిస్తాన్ కు వరుసగా షాకులిస్తున్న కేంద్రం.. జల విద్యుత్ ప్రాజెక్టులపై పని ప్రారంభం 
    పాకిస్తాన్ కు వరుసగా షాకులిస్తున్న కేంద్రం.. జల విద్యుత్ ప్రాజెక్టులపై పని ప్రారంభం

    Hydro projects:పాకిస్తాన్ కు వరుసగా షాకులిస్తున్న కేంద్రం.. జల విద్యుత్ ప్రాజెక్టులపై పని ప్రారంభం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 05, 2025
    01:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌పై కేంద్రం మరొక భారీ నిర్ణయం తీసుకుంది.

    ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని అమలులో నుంచి తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం,ఇప్పుడు ఆ ఒప్పందంతో సంబంధం ఉన్న రెండు కీలక జలవిద్యుత్ ప్రాజెక్టుల పునఃప్రారంభానికి శ్రీకారం చుట్టింది.

    ఈ ప్రాజెక్టులు తిరిగి ప్రారంభమైతే, సింధు నదికి అనుబంధంగా ఉన్న ఉపనదుల నుంచి పాకిస్తాన్‌కు చేరే నీటి ప్రవాహంలో ఆటంకం కలగవచ్చని అంచనా.

    హిమాలయ పర్వత ప్రాంతంలోని కాశ్మీర్‌లో ఉన్న రెండు ప్రధాన జలవిద్యుత్ ప్రాజెక్టుల రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని పెంచే పనులను భారత్ మొదలుపెట్టింది.

    పాకిస్తాన్‌తో ఏర్పడిన తాజా ఉద్రిక్తతల దృష్ట్యా, గతంలో కుదిరిన సింధు జలాల ఒప్పందాన్ని అమలు చేయడం లేదని భారత్ స్పష్టం చేసింది.

    వివరాలు 

    ఈసారి భిన్నంగా స్పందించిన కేంద్రం 

    ఇది భారత్‌కు ఈ ప్రాజెక్టుల సామర్థ్యం పెంచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. దీని వల్ల పాకిస్తాన్‌కు నీటి లభ్యత స్థిరంగా తగ్గే అవకాశముందని భావిస్తున్నారు.

    ఒప్పందం 1960లో కుదిరినప్పటికీ, అప్పటి నుండి ఇప్పటివరకు మూడు యుద్ధాలు జరిగినా,అనేక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా సింధు జలాల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం గౌరవిస్తూ వచ్చింది.

    కానీ, తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్రం ఈసారి భిన్నంగా స్పందించింది. NHPC లిమిటెడ్ అనే భారతదేశ అతిపెద్ద జలవిద్యుత్ సంస్థ, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కలిసి ఈ రెండు ప్రాజెక్టుల రిజర్వాయర్లలో పేరుకుపోయిన మట్టిని తొలగించే పనులను ప్రారంభించాయి.

    ఈక్రమంలో రిజర్వాయర్ల సామర్థ్యాన్ని కూడా పెంచే చర్యలు చేపట్టనున్నారు.

    వివరాలు 

     పాకిస్తాన్‌కు నీటి కొరత ఏర్పడే అవకాశం 

    ఇంకా ప్రస్తుతం ఈ చర్యలతో పాకిస్తాన్‌కు తక్షణమే నీటి కొరత ఏర్పడే అవకాశం తక్కువగానే ఉంది.

    ఎందుకంటే భారత్ నదులపై ఆధారపడి తన అవసరాల కోసం నీటిని వినియోగిస్తుంది.

    అయితే ఇతర ప్రాజెక్టులపై కూడా ఇలాంటి కార్యక్రమాలు ప్రారంభిస్తే పాకిస్తాన్‌పై దీర్ఘకాలిక ప్రభావం తప్పదు.

    ఇప్పటికే సింధు ఉపనదుల నీటి ప్రవాహాన్ని ఆపేందుకు ఎలాంటి యత్నం చేసినా ప్రతిస్పందన ఇస్తామని పాకిస్తాన్ పునరుద్ఘాటించిన నేపథ్యంలో, భారత్ చేపట్టిన తాజా చర్యలకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్ముకశ్మీర్

    తాజా

    NASA: సౌర కుటుంబానికి బయట నీటి ఉనికి గుర్తించిన నాసా నాసా
    Vijay Deverakonda: సినిమా విడుదలను ఆపేయాలనుకున్నారు.. కానీ నమ్మకమే నిలబెట్టింది : విజయ్‌ దేవరకొండ విజయ్ దేవరకొండ
    Jyoti Malhotra: వీడియోల వెనుక గూఢచర్యమే..? జ్యోతి మల్హోత్రా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి!  హర్యానా
    Emergency fund: ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి.. ఎలా మొదలుపెట్టాలి..? పూర్తి వివరాలివే! వ్యాపారం

    జమ్ముకశ్మీర్

    Pahalgam Terror Attack: సౌదీ పర్యటనను కుదించుకుని దిల్లీ చేరుకున్న మోదీ.. ఉగ్రదాడిపై ఎయిర్‌పోర్టులో అత్యవసర భేటీ భారతదేశం
    Saifullah Khalid: పహల్గామ్‌లోని బైసరన్ లోయ ఉగ్రదాడిలో కీలక సూత్రధారి వీడే? భారతదేశం
    Pahalgam Terror Attack: హనీమూన్‌లో విషాదం.. కళ్లముందే భర్తను కోల్పోయిన నవ వధువు ఇండియా
    Kashmir Terror Attack: భర్తను చంపి..భార్యకు మోదీ పేరు ప్రస్తావిస్తూ ఏం చెప్పారంటే.. భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025