LOADING...
USA: అమెరికా దౌత్యవేత్తకు మరోసారి భారత్ సమన్లు
అమెరికా దౌత్యవేత్తకు మరోసారి భారత్ సమన్లు

USA: అమెరికా దౌత్యవేత్తకు మరోసారి భారత్ సమన్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 12, 2026
03:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒమన్ తీర ప్రాంతంలో భారతీయులతో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో అమెరికా దౌత్యవేత్త జేసన్ మీక్స్‌కు భారత్ మరోసారి సమన్లు జారీ చేసింది. గత నాలుగు రోజుల వ్యవధిలోనే అమెరికా మూడు సార్లు నౌకలపై దాడులకు పాల్పడిందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. గురువారం జరిగిన తాజా ఘటనలో ఓ నౌకపై దాడి జరిగినప్పటికీ, అందులో ఉన్న 20 మంది భారతీయ సిబ్బంది సురక్షితంగా బయటపడినట్లు వెల్లడించింది. ఈ దాడులను తీవ్రంగా ఖండించిన భారత్, అమెరికా రాయబార కార్యాలయానికి తన నిరసనను తెలియజేసింది. అంతకుముందు మరో నౌకపై జరిగిన దాడిలో ముగ్గురు భారతీయులు గల్లంతైన ఘటన జరిగిన సమయంలోనూ అమెరికా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.

వివరాలు 

డీజీఎస్ కీలక సూచనలు జారీ

పశ్చిమాసియా సముద్ర జలాల్లో వాణిజ్య నౌకాయానానికి పెరుగుతున్న ముప్పుపై విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. భారతీయ నావికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. ఇదిలా ఉండగా, అమెరికా నౌకాదళం దాడి నేపథ్యంలో ఒమన్ తీరంలో బుధవారం గల్లంతైన ముగ్గురు భారతీయ నావికులు మృతిచెందినట్లు సమాచారం వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్న భారతీయులకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (డీజీఎస్) కీలక సూచనలు జారీ చేసింది.

వివరాలు 

18 వేల మంది నావికులకు అలర్ట్

హర్మూజ్ జలసంధి, ఒమన్ తీర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న సుమారు 18 వేల మంది భారతీయ నావికులకు సముద్ర భద్రతకు సంబంధించిన ప్రత్యేక అడ్వైజరీ విడుదల చేసింది. అప్రమత్తంగా ఉండాలని, భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

Advertisement