NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pahalgam Attack: పాకిస్తాన్ జాతీయులకు వీసా సేవలను తక్షణమే నిలిపివేసిన భారత్.. తక్షణమే దేశాన్ని వీడాలని ఆదేశం
    తదుపరి వార్తా కథనం
    Pahalgam Attack: పాకిస్తాన్ జాతీయులకు వీసా సేవలను తక్షణమే నిలిపివేసిన భారత్.. తక్షణమే దేశాన్ని వీడాలని ఆదేశం
    పాకిస్తాన్ జాతీయులకు వీసా సేవలను తక్షణమే నిలిపివేసిన భారత్.. తక్షణమే దేశాన్ని వీడాలని ఆదేశం

    Pahalgam Attack: పాకిస్తాన్ జాతీయులకు వీసా సేవలను తక్షణమే నిలిపివేసిన భారత్.. తక్షణమే దేశాన్ని వీడాలని ఆదేశం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 24, 2025
    05:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్‌గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్థాన్‌పై గట్టిగా స్పందించింది.

    ఈ పరిణామాల్లో భాగంగా,భారత ప్రభుత్వం పాకిస్థాన్ పౌరులకు ఇచ్చే వీసా సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది.

    మెడికల్ వీసాలు సహా,ఇప్పటికే పాక్ పౌరులకు జారీ చేసిన అన్ని రకాల వీసాలను రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

    ఈవిషయాన్నిగురువారం విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.ఇప్పటికే వీసాలు పొందినవారికి ఈ నెల 27వ తేదీ వరకు గడువు విధించినట్లు స్పష్టం చేసింది.

    అయితే మెడికల్ వీసాలు కలిగిన వారికి మాత్రం కొంత ఊరటనిచ్చింది.వారికీ ఈ నెల 29వ తేదీ వరకు గడువు ఇచ్చింది.

    వీసా గడువు ముగిసేలోపు భారత్‌ను తప్పనిసరిగా వదిలి తమ స్వదేశాలకు వెళ్లిపోవాలంటూ కేంద్రం ఆదేశించింది.

    వివరాలు 

    భారత పౌరులకు కీలక సూచనలు చేసిన కేంద్రం 

    "పాకిస్థాన్ పౌరులకు వీసా సేవలు నిలిపివేయబడ్డాయి. ప్రస్తుతం భారత్‌లో ఉన్న పాక్ పౌరులకు జారీ చేసిన అన్ని వీసాలు రద్దు చేయబడ్డాయి. సాధారణ వీసాలు ఏప్రిల్ 27 వరకు చెల్లుబాటు అవుతాయి. మెడికల్ వీసాలు మాత్రం 29వ తేదీ వరకు మాత్రమే విలువైనవిగా పరిగణించబడతాయి. వీసా గడువు ముగిసేలోపు వారు భారతదేశాన్ని వీడాల్సి ఉంటుంది" అని ప్రకటనలో పేర్కొంది.

    ఇక భారత పౌరుల విషయానికి వస్తే, కేంద్రం వారికి కూడా కీలక సూచనలు చేసింది.

    ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఎవరూ పాకిస్థాన్‌కి ప్రయాణించకూడదని హెచ్చరించింది.

    ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న భారతీయులు వెంటనే అక్కడి నుంచి బయలుదేరి తిరిగి భారత్‌కి రావాలని సూచించింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    తక్షణమే దేశాన్ని వీడాలని ఆదేశం

    Pakistani nationals ordered to leave India by April 27

    Medical visas issued will be valid only till 29 April#Pahalgam #PahalgamTerroristAttack pic.twitter.com/XP7sbC0n2R

    — Ishani K (@IshaniKrishnaa) April 24, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విదేశాంగశాఖ

    తాజా

    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్

    విదేశాంగశాఖ

    MEA Memo: భారతీయ దౌత్యవేత్తలపై 'రహస్య మెమో'.. స్పదించిన విదేశాంగ శాఖ భారతదేశం
    Chinmoy Krishna Das: చిన్మోయ్‌ కృష్ణదాస్‌ అరెస్టుపై స్పందించిన భారత్‌ ఇస్కాన్
    Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీ.. పాకిస్థాన్‌కు భారత జట్టు వెళ్లడంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత  క్రీడలు
    Jaishankar: ఉగ్రవాదమే ఆ దేశాన్ని తినేస్తోంది.. పాకిస్థాన్‌పై మరోసారి మండిపడ్డ జైశంకర్ కేంద్ర ప్రభుత్వం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025