NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'భారత్' పేరు ఇష్టం లేని వాళ్లు దేశం విడిచి వెళ్లిపోండి: బీజేపీ ఎంపీ  వివాదాస్పద వ్యాఖ్యలు 
    తదుపరి వార్తా కథనం
    'భారత్' పేరు ఇష్టం లేని వాళ్లు దేశం విడిచి వెళ్లిపోండి: బీజేపీ ఎంపీ  వివాదాస్పద వ్యాఖ్యలు 
    ఇష్టం లేకుంటే వెళ్లిపోండన్న దిలీప్ ఘోష్

    'భారత్' పేరు ఇష్టం లేని వాళ్లు దేశం విడిచి వెళ్లిపోండి: బీజేపీ ఎంపీ  వివాదాస్పద వ్యాఖ్యలు 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 10, 2023
    05:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండియా పేరు మార్పుపై మరోసారి రగడ మొదలైంది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియా పేరును భారత్‌గా మార్చేస్తామన్నారు.

    ఈ క్రమంలోనే కోల్‌కతాలోని విదేశీయుల విగ్రహాలను తొలగిస్తామని బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్ స్పష్టం చేశారు. అయితే పేరు మార్పును వ్యతిరేకించే వారు భారతదేశం విడిచి వెళ్లిపోవచ్చన్నారు.

    మేదినీపూర్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఖరగ్‌పూర్ నగరంలో 'చాయ్ పే చర్చా' కార్యక్రమం నిర్వహించారు. బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చాక, విదేశీయుల విగ్రహాలన్నింటినీ తొలగిస్తామన్నారు.

    ఇండియా పేరును భారత్‌గా మార్పు చెందుతుందని, ఇష్టం లేని వారు దేశం విడిచి వెళ్లే స్వేచ్ఛ ఉందన్నారు.

    DETAILS

    ఇదే సరైన సమయం : రాహుల్ సిన్హా

    ఒకే దేశానికి రెండు పేర్లు ఉండవని పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన మరో బీజేపీ సీనియర్ నాయకుడు రాహుల్ సిన్హా అన్నారు. G20 సదస్సులో పాల్గొనేందుకు ప్రపంచ నాయకులంతా దిల్లీలోనే ఉన్నారని, ఈ మేరకు పేరు మార్చేందుకు ఇదే సరైన సమయమన్నారు.

    దీనిపై స్పందించిన తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి శాంతను సేన్, ప్రతిపక్ష ఇండియా కూటమికి భయపడి సమస్యల నుంచి దృష్టిని మరల్చేందుకు బీజేపీ యత్నిస్తోందని ఆరోపించారు.

    వచ్చే ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున, భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలన్నీ, ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా)గా ఏర్పడ్డాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీజేపీ
    కోల్‌కతా

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    బీజేపీ

    జేపీ నడ్డా సమక్షంలో ఇవాళ బీజేపీలో చేరనున్న జయసుధ తెలంగాణ
    దేశంలోని ఎమ్మెల్యేల ఆస్తులపై ఏడీఆర్ నివేదిక; తెలంగాణ, ఏపీ శాసన సభ్యుల ఆస్తులు ఎన్ని రూ.కోట్లంటే!  ఎమ్మెల్యే
    నందిని నెయ్యిపై కర్ణాటకలో రాజకీయ దుమారం  కర్ణాటక
    అధికార, ప్రతిపక్షా తీరుపై కలత చెందిన లోక్‌సభ స్పీకర్; సమావేశాలకు గైర్హాజరు  లోక్‌సభ

    కోల్‌కతా

    ఏడేళ్ల బాలిక కిడ్నాప్, ఆపై హత్య; సూట్‌కేస్‌లో మృతదేహం స్వాధీనం పశ్చిమ బెంగాల్
    ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్, దిల్లీ, ముంబైకి చోటు హైదరాబాద్
    పశ్చిమ బెంగాల్‌: పిడుగుపాటుకు 14మంది బలి పశ్చిమ బెంగాల్
    దేశంలోనే రెండో అత్యుత్తమ హై స్ట్రీట్‌గా నిలిచిన సోమాజిగూడ  హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025