NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / India- Pakistan: J&Kలోని నియంత్రణ రేఖ సమీపంలో పాకిస్థానీ క్వాడ్‌కాప్టర్లపై భారత సైన్యం కాల్పులు 
    తదుపరి వార్తా కథనం
    India- Pakistan: J&Kలోని నియంత్రణ రేఖ సమీపంలో పాకిస్థానీ క్వాడ్‌కాప్టర్లపై భారత సైన్యం కాల్పులు 
    J&Kలోని నియంత్రణ రేఖ సమీపంలో పాకిస్థానీ క్వాడ్‌కాప్టర్లపై భారత సైన్యం కాల్పులు

    India- Pakistan: J&Kలోని నియంత్రణ రేఖ సమీపంలో పాకిస్థానీ క్వాడ్‌కాప్టర్లపై భారత సైన్యం కాల్పులు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 16, 2024
    10:56 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్ లోని పూంచ్‌లోని నియంత్రణ రేఖ(ఎల్‌ఓసి)వెంబడి రెండు వేర్వేరు ప్రదేశాల్లో కనిపించిన పాకిస్థాన్ క్వాడ్‌కాప్టర్లపై భారత సైన్యం శుక్రవారం కాల్పులు జరిపింది.

    అయితే,బాల్నోయి-మెంధార్,గుల్పూర్ సెక్టార్లలో భారత్ భూభాగం పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్లు ఎగిరిన తరువాత మళ్ళీ తిరిగి వెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు.

    క్వాడ్‌కాప్టర్ల ద్వారా వస్తువులు, ఆయుధాలు లేదా మాదక ద్రవ్యాలు కింద పడకుండా చూసేందుకు భారత సైన్యం వెంటనే రెండు విభాగాలలో శోధన ఆపరేషన్‌ను ప్రారంభించిందని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు.

    అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మొదటి సంఘటన ఉదయం 6.30 గంటలకు మెంధార్‌లోని బాల్నోయ్ ప్రాంతంలో జరిగింది.

    అదేవిధంగా, అదే సమయంలో గుల్పూర్ సెక్టార్‌పై రెండు క్వాడ్‌కాప్టర్‌లు సంచరించడం గమనించిన భారత సైనికుల కాల్పులను ఎదుర్కొని తిరిగి వచ్చినట్లు తెలిపారు.

    Details 

    పాకిస్థాన్ డ్రోన్ లపై సమాచారం అందించిన వారికీ నగదు బహుమతి

    అయితే, అంతకుముందు, ఫిబ్రవరి 12 న, మెంధార్ సెక్టార్‌లోని మాన్‌కోట్ ప్రాంతంలో శత్రు డ్రోన్ కదలికను గుర్తించిన ఆర్మీ దళాలు దానిపై కాల్పులు చేసినట్లు పేర్కొన్నాయి.

    జమ్ముకశ్మీర్ లోకి మాదక ద్రవ్యాలు, ఆయుధాలను రవాణా చేయడానికి పాకిస్తాన్ డ్రోన్‌లను ఉపయోగిస్తోంది.

    దీంతో అలెర్ట్ అయ్యిన ,జమ్ముకశ్మీర్ పోలీసులు పాకిస్థాన్ నుంచి ఆయుధాలు,మాదకద్రవ్యాలను జారవిడిచేందుకు సరిహద్దు దాటే డ్రోన్‌ల గురించిన సమాచారం అందించిన వారికి 3 లక్షల రూపాయల నగదు బహుమతిని ఇస్తామని ప్రకటించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్ముకశ్మీర్
    లైన్ అఫ్ కంట్రోల్ (ఎల్ ఓ సి)

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    జమ్ముకశ్మీర్

    ఉగ్రదాడిలో మరణించిన కల్నల్‌కు కుమారుడి సెల్యూట్.. తండ్రి చనిపోయిన విషయం చెప్పకుండా.. ఉగ్రవాదులు
    జమ్మూకశ్మీర్: బారాముల్లాలో భీకర ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం ఉగ్రవాదులు
    ఐదో రోజూ కొనసాగుతున్న అనంతనాగ్‌ ఎన్‌కౌంటర్‌.. ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్న భారత సైన్యం ఆర్మీ
    జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్‌లో ఎన్‌కౌంటర్‌.. లష్కరే తోయిబా కమాండర్ హతం ఎన్‌కౌంటర్

    లైన్ అఫ్ కంట్రోల్ (ఎల్ ఓ సి)

    ఇండో చైనా సరిహద్దు వివాదాలు.. ఇరుదేశాల 19వ సారి శాంతి చర్చలు సానుకూలం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025