
Indian Railways: రైలు ప్రయాణికులకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి రైల్వే టికెట్ బుకింగ్లో కొత్త నిబంధన అమలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా రైలు ప్రయాణికులకు తాజా, కీలకమైన అప్డేట్ వచ్చింది. భారతీయ రైల్వే బోర్డు రైలు టికెట్ల బుకింగ్ వ్యవస్థలో పారదర్శకతను పెంచడం, మోసాలను నివారించడం లక్ష్యంగా ముఖ్య నిర్ణయం తీసుకుంది. 2025 అక్టోబర్ 1 నుంచి జనరల్ రిజర్వేషన్ టికెట్లు బుక్ చేసుకోవడానికి కూడా ఆధార్ నంబర్ అనుసంధానం తప్పనిసరి చేయనుంది. కానీ ఈ నిబంధన మొత్తం బుకింగ్ సమయానికి కాకుండా, టికెట్లు అందుబాటులోకి వచ్చిన మొదటి 15 నిమిషాల పాటు మాత్రమే వర్తిస్తుంది.
వివరాలు
కొత్త నిబంధన ఏమిటి?
ఇప్పటివరకు తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఐఆర్సీటీసీ ఖాతాలో ఆధార్ నంబర్ అనుసంధానం తప్పనిసరి అయ్యింది. ఇప్పుడు అదే విధానాన్ని జనరల్ కోటా టికెట్లకు కూడా వర్తింపజేస్తున్నారు. ఉదాహరణకి,నవంబర్ 15న ప్రయాణించాలనుకుంటున్న ప్రయాణికుడు శివ గంగ ఎక్స్ప్రెస్కు టికెట్ బుక్ చేసుకోవాలంటే, రైల్వే బుకింగ్ విండో 60రోజుల ముందుగా,అంటే సెప్టెంబర్ 16న అర్ధరాత్రి 12:20 గంటలకు ఓపెన్ అవుతుంది. ఈ కొత్త విధానం ప్రకారం,మొదటి 15 నిమిషాలు (12:20 నుండి 12:35 వరకు) కేవలం ఆధార్ వెరిఫికేషన్ పూర్తయిన ఐఆర్సీటీసీ యూజర్లు మాత్రమే టికెట్లు బుక్ చేసుకోగలుగుతారు. ఆధార్ లింక్ చేయని ఖాతాదారులకు ఆ సమయంలో టికెట్ బుక్ చేసే అవకాశం ఉండదు.
వివరాలు
పండగల సీజన్లో ప్రత్యేక ప్రయోజనం
రైల్వే అధికారులు తెలిపినట్లే,టికెట్లకు అత్యధిక డిమాండ్ ఉన్న సమయంలో ఈ నిబంధన ద్వారా నిజమైన ప్రయాణికులకే ప్రాధాన్యం కల్పించడమే ముఖ్య ఉద్దేశం. దీపావళి,హోలీ,ఛాఠ్ పూజలు, పెళ్లిళ్ల సీజన్ వంటి ముఖ్య సందర్భాల్లో రైల్వే టికెట్లకు అత్యధిక పోటీ ఉంటే, టికెట్లు కొన్ని నిమిషాల్లోనే పూర్తయిపోతాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కొందరు అక్రమ మార్గాల్లో టికెట్లను హాజరు చేయడం జరుగుతుందని ఆరోపణలు ఉన్నాయి. కొత్త ఆధార్ ఆధారిత నియమంతో ఈ అక్రమ చర్యలకు అడ్డుకట్ట వేయబోతోంది. దీంతో నిజమైన ప్రయాణికులకు టికెట్ దొరికే అవకాశాలు పెరుగుతాయని రైల్వే అధికారులు వెల్లడించారు. గతంలో 2025 జూలై నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్కు ఇదే విధానం విజయవంతంగా అమలు కావడంతో ఇప్పుడు జనరల్ కోటాకూ దాన్ని విస్తరించారు.
వివరాలు
ప్రయాణికులు ఏం చేయాలి?
ఈ మార్పులకు తగినట్టు ముందుగానే సిద్ధం కావడం అవసరం. అక్టోబర్ 1 లోపు తమ ఐఆర్సీటీసీ యూజర్ ఖాతాలో ఆధార్ నంబర్ను అనుసంధానం చేయించుకోవాలని రైల్వే శాఖ సూచిస్తోంది. సాధారణంగా జనరల్ రిజర్వేషన్ విండో ప్రతిరోజూ అర్ధరాత్రి 12:20 నుండి రాత్రి 11:45 వరకు పనిచేస్తుంది. కొత్త నిబంధన కేవలం మొదటి 15 నిమిషాలకు మాత్రమే వర్తించనుంది. రైల్వే అధికారులు వెల్లడించిన విధంగా, ఈ మార్పుల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది ప్రయాణికులకు మరింత న్యాయమైన, సురక్షితమైన టికెట్ బుకింగ్ ప్రక్రియను అందించడమే వారి ప్రధాన లక్ష్యం.