NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Vande Bharat Sleeper: 2025లో 10 కొత్త వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించనున్న రైల్వేశాఖ.. రూట్‌లు, కొత్త ఫీచర్లను ఇవే..!
    తదుపరి వార్తా కథనం
    Vande Bharat Sleeper: 2025లో 10 కొత్త వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించనున్న రైల్వేశాఖ.. రూట్‌లు, కొత్త ఫీచర్లను ఇవే..!
    2025లో 10 కొత్త వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించనున్న రైల్వేశాఖ.

    Vande Bharat Sleeper: 2025లో 10 కొత్త వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించనున్న రైల్వేశాఖ.. రూట్‌లు, కొత్త ఫీచర్లను ఇవే..!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 18, 2024
    01:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులకు అధిక సౌకర్యాలను అందించేందుకు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను అన్వేషిస్తోంది.

    ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా వందే భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టింది. వేగవంతమైన ఈ సెమీ హైస్పీడ్‌ రైళ్లు ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ పొందుతున్నాయి.

    తాజాగా, వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకురావడానికి రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది.

    దీని భాగంగా, 2025-26 నాటికి ఈ స్లీపర్‌ రైళ్లను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

    ప్రపంచస్థాయి సౌకర్యాలు, ఆధునిక డిజైన్‌ కలిగిన ఈ రైళ్లు సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులకు మరింత సౌలభ్యాన్ని అందించనున్నాయి.

    వివరాలు 

    2025లో వాణిజ్య ప్రయాణాల కోసం అందుబాటులోకి..

    ఒక నివేదిక ప్రకారం, భారతీయ రైల్వే 2025-26 నాటికి దశాబ్దపు వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.

    దేశంలోని తొలి వందే భారత్‌ స్లీపర్‌ రైలు ట్రయల్‌ రన్‌ అనంతరం, 2025లో వాణిజ్య ప్రయాణాల కోసం అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

    చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ICF) జనరల్‌ మేనేజర్‌ సుబ్బారావు ఈ విషయాన్ని ధృవీకరించారు.

    నవంబర్‌ 15 నుంచి రెండు నెలల పాటు రైళ్లపై ఆసిలేషన్‌ ట్రయల్స్‌ జరగనున్నాయని, వాటి పూర్తి అవ్వగానే కమర్షియల్‌ సర్వీస్‌లోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు.

    వివరాలు 

    16కోచ్‌లతో స్లీపర్‌ రైలు

    ఈ రైళ్లు భద్రతా ప్రమాణాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ నిర్మించబడ్డాయి.ఆస్తెనిటిక్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో తయారుచేసిన ఈ రైళ్లు,క్రాష్‌ బఫర్స్‌,ప్రత్యేకంగా రూపొందించిన కప్లర్ల వంటి ఆధునిక భద్రతా పరికరాలతో అమర్చబడి ఉంటాయి.

    అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులను సురక్షితంగా ఉండేలా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు.

    ఈ స్లీపర్‌ రైలు 16కోచ్‌లతో రూపొందించబడింది, దీని సామర్థ్యం 823 మంది ప్రయాణికులు. ఫస్ట్ క్లాస్‌ ఏసీ,సెకండ్ క్లాస్‌ ఏసీ,థర్డ్ క్లాస్‌ ఏసీ వంటి భిన్న సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

    వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లు నడిచే మార్గాలను ఇంకా ఖరారు చేయలేదు.అయితే,న్యూఢిల్లీ-పూణే, న్యూఢిల్లీ-శ్రీనగర్‌ వంటి ముఖ్యమైన మార్గాల్లో ఈరైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది.

    భారతీయ రైల్వే ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడంలో ఈ రైళ్లు కీలక పాత్ర పోషించనున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వందే భారత్ స్లీపర్ కోచ్ రైలు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    వందే భారత్ స్లీపర్ కోచ్ రైలు

    Vande Bharat: వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌ల రిచ్ లుక్ అదిరిపోయిందిగా..  వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025