Page Loader
చైనా ఆధీనంలో భారత భూభాగం, పార్లమెంట్‌లో ప్రతిపక్షాలను మాట్లాడనివ్వరు: కేంద్రంపై రాహుల్ ధ్వజం
చైనా ఆధీనంలో భారత భూభాగం, పార్లమెంట్‌లో ప్రతిపక్షాలను మాట్లాడనివ్వరు: కేంద్రంపై రాహుల్ ధ్వజం

చైనా ఆధీనంలో భారత భూభాగం, పార్లమెంట్‌లో ప్రతిపక్షాలను మాట్లాడనివ్వరు: కేంద్రంపై రాహుల్ ధ్వజం

వ్రాసిన వారు Stalin
Mar 06, 2023
04:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

లండన్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో, పార్లమెంటులో ప్రతిపక్ష మాట్లాడనివ్వదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. లండన్‌లోని హౌన్స్‌లోలో భారతీయ ప్రవాసులను ఉద్దేశించి గాంధీ మాట్లాడారు. భారత భూభాగంలోకి చైనా చొరబడిందని పేర్కొన్నారు. అయితే ప్రతిపక్ష పార్టీలు దాని గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి అనుమతించలేదని మండిపడ్డారు. చైనా చొరబాటు, నరేంద్ర మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ, అదానీ గ్రూప్-హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వివాదం వంటి సమస్యలపై బీజేపీని కాంగ్రెస ప్రశ్నిచిందని చెప్పారు.

రాహుల్ గాంధీ

బలమైన వారితో పోరాడకూడదనేది ఆర్ఎస్ఎస్-బీజేపీ సిద్ధాంతం: రాహుల్

దేశంలో ప్రతిపక్ష భావనను కేంద్ర ప్రభుత్వం అనుమతించదని, పార్లమెంటులో కూడా అదే జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. చైనా చొరబాటుపై పార్లమెంట్‌లో మాట్లాడటానికి అనుమతి ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. చైనా బలంగా ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చేసిన వ్యాఖ్యలను రాహుల్ పిరికితనంగా అభివర్ణించారు. హిందుత్వ సిద్ధాంతకర్త సావర్కర్ పుస్తకాన్ని ప్రస్తావిస్తూ.. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ తత్వశాస్త్రంలో పిరికితనం ప్రధానమైనదన్నారు. బలమైన వారితో పోరాడకూడదనేది వారి ఉద్దేశమన్నారు. అలా అయితే, భారతదేశం చాలా బలంగా ఉన్న బ్రిటీష్‌ వారితో పోరాడి స్వాతంత్ర్యం సాధించి ఉండకూడదని గాంధీ పేర్కొన్నారు.