NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Congress: నేడే ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభం.. భవనానికి 'ఇందిరాగాంధీ భవన్' గా పేరు 
    తదుపరి వార్తా కథనం
    Congress: నేడే ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభం.. భవనానికి 'ఇందిరాగాంధీ భవన్' గా పేరు 
    నేడే ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభం.. భవనానికి 'ఇందిరాగాంధీ భవన్' గా పేరు

    Congress: నేడే ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభం.. భవనానికి 'ఇందిరాగాంధీ భవన్' గా పేరు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 15, 2025
    10:14 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కాంగ్రెస్ పార్టీ నూతన కేంద్ర కార్యాలయాన్ని ఈ రోజు (బుధవారం) ప్రారంభించనుంది.

    కొత్త భవనానికి 'ఇందిరాగాంధీ భవన్' అని పేరు పెట్టారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ అగ్రనేత సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రారంభించనున్నారు.

    తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇప్పటికే దిల్లీకి వెళ్లారు.

    ప్రస్తుతం, అక్బర్ రోడ్డు 24వ నంబర్ బంగ్లాలో ఏఐసీసీ కార్యాలయాలు కొనసాగుతున్నాయి.

    గతంలో, కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ బంగ్లాల్లో పార్టీ కార్యాలయాలు ఉండకూడదని నిర్ణయం తీసుకుంది.

    ఈ నిర్ణయానికి అనుగుణంగా, వివిధ పార్టీలు తమ సొంత భవనాలు నిర్మించుకున్నాయి.

    ఐదు దశాబ్దాలుగా అక్బర్ రోడ్డులో కాంగ్రెస్ కార్యకలాపాలు జరుగుతున్నాయి, 1978 నుండి ఇది ఏఐసీసీ కేంద్ర కార్యాలయంగా పనిచేస్తోంది.

    వివరాలు 

    15 సంవత్సరాలపాటు ఇందిరాగాంధీ భవన్ నిర్మాణం

    9A కోట్లా రోడ్డులో 6 అంతస్తులతో అత్యాధునిక సౌకర్యాలతో కొత్త కేంద్ర కార్యాలయాన్ని నిర్మించారు.

    కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కోట్లా మార్గానికి తరలించినప్పటికీ, అక్బర్ రోడ్డులో కూడా పార్టీ కార్యకలాపాలు కొనసాగుతాయని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

    2008లో కేంద్ర ప్రభుత్వం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లో కాంగ్రెస్ పార్టీకి స్థలం కేటాయించింది.

    ఆ తరువాత, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ నుండి కోట్లా మార్గ్ వైపు ప్రవేశాన్ని మార్చారు.

    2009లో కేంద్ర కార్యాలయం నిర్మాణం ప్రారంభమైంది. 15 సంవత్సరాలపాటు ఇందిరాగాంధీ భవన్ నిర్మాణం కొనసాగింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగ్రెస్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    కాంగ్రెస్

    Manipur Congress Chief: మణిపూర్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడికి ఈడీ సమన్లు.. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఫైర్ మణిపూర్
    AAP: దిల్లీలో ఒంటరిగా పోటికి సిద్ధమైన ఆమ్‌ఆద్మీ పార్టీ.. కాంగ్రెస్‌పై విమర్శలు ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    Rahul Gandi: బాబా సిద్దిఖీ హత్యపై రాహుల్ గాంధీ ఆగ్రహం.. ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు  రాహుల్ గాంధీ
    Mallikharjun Kharge: ఖర్గే కుటుంబం కీలక నిర్ణయం.. కేటాయించిన భూమిని తిరిగిచ్చేందుకు సిద్ధం..!  మల్లికార్జున ఖర్గే
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025