NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Republic Day 2025: గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో
    తదుపరి వార్తా కథనం
    Republic Day 2025: గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో
    గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో

    Republic Day 2025: గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 12, 2025
    11:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    2025 గణతంత్ర దినోత్సవం కోసం ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో హాజరయ్యే అవకాశం ఉందని పలు మీడియా వర్గాలు పేర్కొన్నాయి.

    73 ఏళ్ల మాజీ ఆర్మీ జనరల్ సుబియాంటో 2024 అక్టోబరులో ఇండోనేషియా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ పర్యటనలో ఆయన భారత-ఇండోనేషియా సంబంధాలపై ప్రధానమంత్రి మోదీతో విస్తృత చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

    అధికారిక ప్రకటన త్వరలో అందే అవకాశం ఉంది. గతేడాది ప్రబోవో ప్రధాని మోదీతో ఫోన్‌ కాల్‌లో, ఇరుదేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు.

    Details

    సంప్రదాయంగా మారిన విదేశీ ప్రముఖులను ఆహ్వానించడం

    2023 నవంబర్‌లో బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో జరిగిన G20 శిఖరాగ్ర సదస్సులో, ప్రబోవో ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌తో వాణిజ్యం, ఆరోగ్యం, భద్రత వంటి రంగాల్లో సహకారంపై చర్చలు జరిపారు.

    భారత్‌ గణతంత్ర దినోత్సవానికి 1950 నుండి విదేశీ ప్రముఖులను ఆహ్వానించడం సంప్రదాయం. 1952, 53, 66 సంవత్సరాల్లో మాత్రమే విదేశీ అతిథులు లేకుండా గణతంత్ర వేడుకలు నిర్వహించారు.

    2007లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌, 2008లో ఫ్రాన్స్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ, 2015లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, 2016లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్సోయిస్ హోలన్‌, 2021లో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

    Details

    2021లో బోరిస్ జాన్సన్ పర్యటన రద్దు

    2021లో కరోనా కారణంగా బోరిస్ జాన్సన్‌ పర్యటన రద్దయింది.

    2018లో ఆసియాన్‌ దేశాల నాయకులను గణతంత్ర దినోత్సవానికి ఆహ్వానించగా, 2023లో ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతా అల్‌ సిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

    2024లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేల్‌ మెక్రాన్‌ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గణతంత్ర దినోత్సవం
    ఇండోనేషియా

    తాజా

    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు
    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్

    గణతంత్ర దినోత్సవం

    రిపబ్లిక్ డే వేళ.. దిల్లీలో ఖలిస్తానీ అనుకూల పోస్టర్ల కలకలం దిల్లీ
    ఛత్తీస్‌గఢ్‌: చరిత్రలో తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్‌లో 'థర్డ్ జెండర్' సిబ్బంది ఛత్తీస్‌గఢ్
    రిపబ్లిక్ డే: మీ ఇంటి అలంకరణలో మూడు రంగులను ఇలా ఉపయోగించండి లైఫ్-స్టైల్
    రాజ్‌భవన్‌లోనే గవర్నర్ రిపబ్లిక్ డే వేడుకలు, రాష్ట్ర ప్రభుత్వం లేఖపై తమిళసై అసహనం తెలంగాణ

    ఇండోనేషియా

    ఇండోనేషియాలో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రత నమోదు అంతర్జాతీయం
    కలుషిత మందులపై తక్షణమే చర్యలు తీసుకోండి: డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ
    ఇండోనేషియాలో 7.3 తీవ్రతతో భారీ భూకంపం; సునామీ హెచ్చరికలు  తాజా వార్తలు
    హనీమాన్ కి ఇండోనేషియా వెళ్లిన తమిళ వైద్యజంట.. ప్రమాదవశాత్తు సముద్రంలో పడి మృతి తమిళనాడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025