NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Colombo airport: చెన్నై నుంచి సమాచారం.. శ్రీలంక ఎయిర్‌పోర్టులో భారీ సెర్చ్‌ ఆపరేషన్
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Colombo airport: చెన్నై నుంచి సమాచారం.. శ్రీలంక ఎయిర్‌పోర్టులో భారీ సెర్చ్‌ ఆపరేషన్
    చెన్నై నుంచి సమాచారం.. శ్రీలంక ఎయిర్‌పోర్టులో భారీ సెర్చ్‌ ఆపరేషన్

    Colombo airport: చెన్నై నుంచి సమాచారం.. శ్రీలంక ఎయిర్‌పోర్టులో భారీ సెర్చ్‌ ఆపరేషన్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 03, 2025
    08:55 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గాం ఉగ్రదాడిలో పాల్పడినవారిని పట్టుకునేందుకు భద్రతా దళాలు విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు చేపడుతున్నాయి.

    ఈ నేపథ్యంలో భారత్ అందించిన సమాచారంతో శ్రీలంక రాజధాని కొలంబో ఎయిర్‌పోర్టులో పెద్దఎత్తున తనిఖీలు జరిగాయి.

    పహల్గాం దాడిలో పాల్గొన్నట్లు అనుమానిస్తున్న ఆరుగురు చెన్నై నుంచి శ్రీలంక వెళ్ళే విమానం ఎక్కి ఉండొచ్చని భారత ప్రభుత్వం తెలిపింది.

    ఈ అనుమానంతో శ్రీలంక ఎయిర్‌లైన్స్‌కు చెందిన UL122 విమానం బండారునాయికే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరిన వెంటనే తనిఖీలు మొదలయ్యాయి.

    ఈ ఆపరేషన్‌లో శ్రీలంక పోలీసులు, ఎయిర్‌ఫోర్స్, ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ అధికారులు సంయుక్తంగా పాల్గొన్నారు.

    చెన్నై ఏరియా కంట్రోల్ సెంటర్ నుంచి వచ్చిన హెచ్చరిక ఆధారంగా ఈ తనిఖీలు జరిగినట్లు విమానయాన సంస్థ వెల్లడించింది.

    Details

    ఏప్రిల్ 15న పహల్గాంలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు

    అయితే తనిఖీల్లో ఎలాంటి అనుమానితులూ గుర్తించకపోవడంతో విమానానికి తదుపరి కార్యకలాపాలకు అనుమతి ఇచ్చారు.

    ఇక ఏప్రిల్ 22న పహల్గాం ప్రాంతంలోని బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు కిరాతక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.

    ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అనంతరం భద్రతా ఏజెన్సీలు దర్యాప్తును ముమ్మరం చేశాయి.

    టెర్రరిస్టులకు భూమిస్థాయిలో సహకరించిన ఓవర్‌గ్రౌండ్ వర్కర్లను విస్తృతంగా అరెస్టు చేశారు.

    దర్యాప్తులో ఒకరు వెల్లడించిన వివరాల ప్రకారం, ఉగ్రవాదులు ఏప్రిల్ 15న పహల్గాంలోకి ప్రవేశించారు.

    Details

    భద్రతా ఏజెన్సీల నిఘాలో అనుమానితులు

    అనంతరం వారు బైసరన్ వ్యాలీ, అరు వ్యాలీ, స్థానిక అమ్యూస్‌మెంట్ పార్క్, బేతాబ్ వ్యాలీ ప్రాంతాల్లో నాలుగు రెక్కీలు నిర్వహించారు.

    అయితే చాలా ప్రాంతాల్లో భద్రతా బలగాలు మోహరించడంతో వారు దాడులను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఈ దాడికి సహకరించినవారిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గుర్తించింది.

    వీరిలో కొంతమందిని ఇప్పటికే అరెస్టు చేయగా, మిగతా అనుమానితులు భద్రతా ఏజెన్సీల నిఘాలో ఉన్నారు.

    ఈ ఘటనల నేపథ్యంలో భారత్, శ్రీలంక భద్రతా సంస్థలు మరింత అప్రమత్తమయ్యాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    శ్రీలంక
    చెన్నై

    తాజా

    Jr.NTR: మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్‌.. ఆ బయోపిక్‌లో నటించనున్న హీరో!  జూనియర్ ఎన్టీఆర్
    Manipur: మయన్మార్ సరిహద్దుల్లో మిలిటెంట్ల కదలికలు.. అసోం రైఫిల్స్ ఆపరేషన్‌లో 10 మంది మృతి మణిపూర్
    Canada: కెనడా మంత్రివర్గంలో భారతీయ మూలాల నేతలకు కీలక పదవులు  కెనడా
    Shubhanshu Shukla: జూన్‌ 8న నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ లాంచ్ కాంప్లెక్స్ నుండి అంతరిక్షంలోకి వెళ్లనున్న భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా నాసా

    శ్రీలంక

    IND vs SL : ఇవాళ ఇండియా, శ్రీలంక టీ20 మ్యాచ్.. పిచ్ గురించి తెలుసుకోండి టీమిండియా
    IND vs SL : భారత్‌పై నాలుగు వికెట్లతో విజృంభించిన మతీషా పతిరనా టీమిండియా
    IND vs SL : మొదటి టీ20లో టీమిండియా సూపర్ విక్టరీ టీమిండియా
    IND vs SL : నేడు రెండో టీ20.. సిరీస్‌పై కన్నేసిన టీమిండియా టీమిండియా

    చెన్నై

    ప్రముఖ హాస్యనటుడు ఆర్‌ఎస్ శివాజీ కన్నుమూత  కోలీవుడ్
    ఇండిగో విమానంలో అనూహ్య ఘటన.. గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ తెరిచే ప్రయత్నం  ఇండిగో
    తమిళనాడు: చెన్నైలో విద్యుత్ అధికారులు, కాంట్రాక్టర్లు లక్ష్యంగా ఐటీ దాడులు  తమిళనాడు
    IPL 2024 Auction: 10 ఐపీఎల్ ప్రాంచైజీలు రిలీజ్ చేసిన ఆటగాళ్లు వీరే  ఐపీఎల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025