Page Loader
Election Commission : ఈసీ కీలక నిర్ణయం.. ఓటరుతో పాటు పోతే మీకు ఇంకుపడుద్ది
ఈసీ కీలక నిర్ణయం.. ఓటరుతో పాటు పోతే మీకు ఇంకుపడుద్ది

Election Commission : ఈసీ కీలక నిర్ణయం.. ఓటరుతో పాటు పోతే మీకు ఇంకుపడుద్ది

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 08, 2023
02:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వృద్ధులు, వికలాంగులు తదితర ఓటర్లతో పాటు పోలింగ్ బూత్‌లకు సహాయకులగా వచ్చేవారి చేతి వేలిపై కూడా సిరా గుర్తును వేయాలని స్పష్టం చేసింది. సహాయకుల కుడి చేతి చూపుడు వేలికి ఇంక్ గుర్తు పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. సాధారణంగా ఓటరు ఎడమవైపు చూపుడు వేలుపై సిరా గుర్తును చేశారు. ఇక ఓవర్ల సహాయకులుగా వచ్చిన వారి కుడిచేతికి చూపుడు వేలిపై సిరా గుర్తు ఉండనుంది. అయితే పోలింగ్ కేంద్రాల్లో సర్పంచులు, వార్డు సభ్యులు పోలింగ్ ఏంజెంట్లుగా కూర్చునే అవకాశాన్ని కూడా ఎన్నికల సంఘం కల్పించింది.

Details

తెలంగాణలో డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు

మరోవైపు మాక్ పోలింగ్ ఉదయం 5.30గంటలకు ప్రారంభించాలని ఎన్నికల సంఘం తెలిపింది. తెలంగాణ అసెంబ్లీకి ఈనెల 30న పోలింగ్ జరుగుతుండగా, ఈ ఏడాది డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. తెలంగాణతో పాటు మరో నాలుగు అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా నగదు పట్టుబడినట్లు అధికారులు