NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / mangoes: తెలంగాణ మామిడికి అంతర్జాతీయ గుర్తింపు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    mangoes: తెలంగాణ మామిడికి అంతర్జాతీయ గుర్తింపు
    తెలంగాణ మామిడికి అంతర్జాతీయ గుర్తింపు

    mangoes: తెలంగాణ మామిడికి అంతర్జాతీయ గుర్తింపు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 28, 2025
    11:49 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే మామిడిపండ్లను శుద్ధి చేసి, రైతుల ద్వారానే 'తెలంగాణ బ్రాండ్' పేరుతో విదేశాలకు ఎగుమతి చేయాలని ఉద్దేశిస్తోంది.

    ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఉద్యానశాఖ రూ.35 కోట్లతో ప్రత్యేక ప్రతిపాదనలు రూపొందించింది. ప్రస్తుతం తెలంగాణ మామిడికి విదేశాల్లో మంచి ఆదరణ ఉంది.

    రాష్ట్రంలో ఏటా సుమారు ఆరువేల టన్నుల మామిడికాయలు కాస్తున్నాయి. అయితే, వీటిలో వేయి టన్నుల వరకు మాత్రమే విదేశాలకు ఎగుమతవుతున్నాయి.

    ఇప్పటి వరకు ప్రైవేటు కంపెనీలు మామిడిని కొనుగోలు చేసి ముంబయి, బెంగళూరులాంటి నగరాలకు తరలించి అక్కడ శుద్ధి చేసి, విదేశాలకు పంపిస్తూ లాభాలు పొందుతున్నాయి.

    దీనిని మార్చేందుకు ప్రభుత్వం నేరుగా రైతుల ద్వారానే ఎగుమతులు జరగాలని నిర్ణయించింది.

    Details

    రూ.5 కోట్లతో వేపర్‌ హీట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌

    ఈ నేపథ్యంలో, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు ఉద్యానశాఖ అధికారులు శుద్ధి సదుపాయాల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించారు.

    ఇందులో భాగంగా

    మామిడిపై ఉండే పురుగులను తొలగించేందుకు రూ.24 కోట్లతో అటామిక్‌ రీసెర్చ్‌ ఎనర్జీ యంత్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.

    మామిడిని మెరిసేలా చేసేందుకు రూ.5 కోట్లతో వేపర్‌ హీట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను స్థాపించనున్నారు.

    మామిడిని మగ్గబెట్టేందుకు రూ.3 కోట్లతో హాట్‌వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు.

    మామిడిని నిల్వ చేయడానికి రూ.4 కోట్లతో కోల్డ్‌ రూమ్స్‌ను ఏర్పాటు చేయనున్నారు.

    ప్యాకింగ్ అవసరాల కోసం ఇంటిగ్రేటెడ్‌ ప్యాక్‌హౌస్‌ ఏర్పాటు చేయడానికి రూ.2 కోట్లు ఖర్చు చేయనున్నారు.

    Details

    రైతులకు లాభాలు చేకూరే అవకాశం

    బాటసింగారం పండ్ల మార్కెట్‌తో పాటు ఇతర ముఖ్య ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాల కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

    ఇక కోహెడలో అంతర్జాతీయ మార్కెట్ ప్రారంభమైన తర్వాత, అక్కడ పదికి పైగా ప్యాక్‌హౌస్‌లను ఏర్పాటుచేసేందుకు కూడా ఉద్యానశాఖ ప్రణాళిక రూపొందిస్తోంది.

    ఈ చర్యలతో తెలంగాణ మామిడికి అంతర్జాతీయంగా మరింత గుర్తింపు లభించనుండటమే కాకుండా, రైతులకు నేరుగా లాభాలు చేకూరే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    తెలంగాణ

    Telangana: తెలంగాణలోని అన్ని దేవాలయాలలో ఆన్‌లైన్ టికెట్ వ్యవస్థ  భారతదేశం
    Vanajeevi Ramaiah: వన ప్రేమికుడు వనజీవి రామయ్య కన్నుమూత ఖమ్మం
    Revanth Reddy: మూసీ పునరుజ్జీవానికి శ్రీకారం.. సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ఆదేశాలు! రేవంత్ రెడ్డి
    TG Weather Update: తెలంగాణ‌లో ఈదురుగాలులతో వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ! భారీ వర్షాలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025