NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / భోగాపురం విమానాశ్రయానికి జగన్ శంకుస్థాపన; మత్స్యం ఆకారంలో నిర్మించనున్న జీఎంఆర్ 
    తదుపరి వార్తా కథనం
    భోగాపురం విమానాశ్రయానికి జగన్ శంకుస్థాపన; మత్స్యం ఆకారంలో నిర్మించనున్న జీఎంఆర్ 
    భోగాపురం విమానాశ్రయానికి జగన్ శంకుస్థాపన; మత్స్యం ఆకారంలో నిర్మించనున్న జీఎంఆర్

    భోగాపురం విమానాశ్రయానికి జగన్ శంకుస్థాపన; మత్స్యం ఆకారంలో నిర్మించనున్న జీఎంఆర్ 

    వ్రాసిన వారు Stalin
    May 03, 2023
    11:42 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు.

    ఏపీ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, జీఎంఆర్ గ్రూప్‌ల మధ్య ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో విజయనగరం జిల్లా భోగాపురంలో ఈ విమానాశ్రయాన్ని అన్ని హంగులతో నిర్మించనున్నారు.

    ఈ విమానాశ్రయాన్ని విభిన్నంగా నిర్మించేందుకు జీఎంఆర్ సంస్థ ఇప్పటికే నమూనాను సిద్ధం చేసింది. ఈతో కొడుతున్న చేప ఆకారంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అబ్బురపరిచేలా జీఎంఆర్ నిర్మించనుంది.

    ఈ నమూనాకు సీఎం జగన్ కూడా ఆమోదం తెలిపారు.

    విజయనగరం

    రూ. 4,592 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం

    భోగాపురం విమానాశ్రయం రాష్ట్ర అభివృద్ధికి, ఉత్తర ఆంధ్రలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి కీలకంగా మారుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

    ఈ విమానాశ్రయాన్ని దాదాపు రూ.4,592 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు.

    జీఎంఆర్ గ్రూప్‌ భోగాపురం విమానాశ్రయాన్ని మూడేళ్లలో నిర్మించి అందుబాటులో తెచ్చేందుకు సిద్ధమవుతోంది.

    2,203 ఎకరాల విస్తీర్ణంతో భోగాపురం విమానాశ్రయ నిర్మాణాన్ని నిర్మించనున్నారు.

    తొలి దశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులకు ఈ విమానాశ్రయం సేవలు అందిస్తుంది.

    రెండో దశలో 1.2కోట్ల మంది, మూడో దశలో 1.8 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా దీన్ని అప్‌గ్రేడ్ చేయనున్నారు.

    జగన్

    22ఎయిర్ బ్రిడ్జిల ఏర్పాటు 

    ప్రయాణీకుల టెర్మినల్, విమాన నిర్వహణ, మరమ్మతుల కోసం ఏవియేషన్ అకాడమీ, కార్గో కాంప్లెక్స్, ఎంఆర్ఓ యూనిట్‌తో పాటు ఏడు ఎయిర్ బ్రిడ్జిలను నిర్మించనున్నారు.

    ఒకేసారి 22 విమానాలను నిలపడానికి 22ఎయిర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయనున్నారు. విమానాశ్రయం 3.5 కిమీ కంటే ఎక్కువ రన్‌వే, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ టవర్, కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ వింగ్‌లను కలిగి ఉంటుంది.

    వైజాగ్‌ నగరానికి 50కిలోమీటర్ల దూరంలో విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో విమానాశ్రయం నిర్మాణానికి 2200 ఎకరాల భారీ భూమిని సేకరించారు.

    రాష్ట్ర ప్రభుత్వం భీమిలి నుంచి భోగాపురం వరకు 20 కిలోమీటర్ల దూరంలో 6 లేన్ల బీచ్ కారిడార్ రహదారిని అభివృద్ధి చేస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విజయనగరం
    వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    ఆంధ్రప్రదేశ్
    విమానాశ్రయం

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    విజయనగరం

    మనసును కదిలించే సంఘటన: భార్య మృతదేహాన్ని భూజాలపై మోసుకుంటూ కాలిననడకన ఒడిశాకు.. ఆంధ్రప్రదేశ్
    ముంచుకొస్తున్న తుఫాను, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఆంధ్రప్రదేశ్
    ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వేపాడ చిరంజీవి ఎవరంటే? ఎమ్మెల్సీ

    వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    రాజకీయాల్లోకి వైఎస్ భారతి; జమ్మలమడుగు నుంచి అసెంబ్లీ బరిలో? జమ్మలమడుగు
    ఆంధ్రప్రదేశ్: 18మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన వైఎస్సార్సీపీ ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణస్వీకారం, సీఎం జగన్‌ హాజరు ఆంధ్రప్రదేశ్
    వైజాగ్‌: 'ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023'ను ప్రారంభించిన జగన్: దిగ్గజ కంపెనీలు హాజరు ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    ఏప్రిల్ 10, 11 తేదీల్లో కరోనా మాక్ డ్రిల్; ఆరోగ్య శాఖ ఏర్పాట్లు కోవిడ్
    అనంతపురం ఆర్టీఏ ఆఫీస్ సమీపంలో భారీ పేలుడు; ఒకరు దర్మరణం అనంతపురం అర్బన్
    రేపు సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; ట్రైన్ రూట్, టికెట్ ధరలను తెలుసుకోండి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    వైజాగ్ స్టీల్ ప్లాంట్‌‌ను వేలంలో దక్కించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్ విశాఖపట్టణం

    విమానాశ్రయం

    కోడి కత్తి కేసు: జగన్ రావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    1.5 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బంది అరెస్ట్ ఎయిర్ ఇండియా
    ఇండిగో విమానం పాకిస్థాన్‌లో అత్యవసర ల్యాండింగ్; ప్రయాణికుడు మృతి పాకిస్థాన్
    భారతదేశపు మొట్టమొదటి మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ బెంగళూరు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025