Page Loader
AP Assembly: ప్రతిపక్ష హోదాపై జగన్ అసత్య ప్రచారం.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు
ప్రతిపక్ష హోదాపై జగన్ అసత్య ప్రచారం.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు

AP Assembly: ప్రతిపక్ష హోదాపై జగన్ అసత్య ప్రచారం.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 05, 2025
11:45 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) పోరాటం చేస్తోంది. ఈ అంశంపై మాజీ సీఎం వైఎస్ జగన్ హైకోర్టును కూడా ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తనను అధికారిక ప్రతిపక్ష నేతగా గుర్తించాలని స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని జగన్ కోర్టును అభ్యర్థించారు. అయితే ఈ అంశంపై హైకోర్టు ఇంకా తుది నిర్ణయం వెలువరించలేదు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) కీలక ప్రకటన చేశారు. ప్రతిపక్ష హోదాపై జగన్ తప్పుడు ఆరోపణలు చేస్తూ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హైకోర్టు తనకు నోటీసులు జారీ చేసిందని జరుగుతున్న ప్రచారం అసత్యమని స్పష్టం చేశారు. ఈ వాస్తవం తెలిసినా జగన్ చేసిన వ్యాఖ్యలను క్షమిస్తున్నానని అన్నారు.

Details

10శాతం సీట్లు లేకుంటే ప్రతిపక్ష హోదా ఉండదని స్పష్టీకరణ 

బుధవారం అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, ప్రతిపక్ష హోదా గురించి జగన్ కోర్టుకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. జగన్ వేసిన పిటిషన్‌ ఇంకా విచారణ దశలోనే ఉందని తెలిపారు. అయితే అసెంబ్లీలో కనీసం 10శాతం సీట్లు పొందిన పార్టీనే అధికారిక ప్రతిపక్ష హోదా పొందుతుందని జగన్ గమనించాలని స్పీకర్ స్పష్టం చేశారు. టీడీపీకి లోక్‌సభలో ప్రతిపక్ష హోదా లేదు జగన్ చేసిన మరో ఆరోపణకు కూడా స్పీకర్ స్పందించారు. గతంలో టీడీపీకి లోక్‌సభలో ప్రతిపక్ష హోదా ఇచ్చారనేది అసత్యం అని ఖండించారు. టీడీపీ నేత కేశినేని ఉపేంద్రను ప్రతిపక్ష నేతగా గుర్తించలేదని, టీడీపీ పార్లమెంటరీ గ్రూప్ లీడర్‌గా మాత్రమే గుర్తింపు లభించిందని స్పష్టం చేశారు.

Details

వైసీపీ అసత్య ప్రచారం.. సభా హక్కుల ఉల్లంఘన 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నదని, స్పీకర్‌పై అనవసర ఆరోపణలు చేయడం సభా హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుందని అయ్యన్నపాత్రుడు అన్నారు. అయినా ఇప్పటివరకు జగన్ చేసిన అసత్య ప్రచారాన్ని సంధి ప్రేలాపనగా పరిగణించి క్షమిస్తున్నానని స్పీకర్ పేర్కొన్నారు.