LOADING...
Udaan Yatri Cafe: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఎయిర్‌పోర్టుల్లో చౌక ధరలకే ఫుడ్
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఎయిర్‌పోర్టుల్లో చౌక ధరలకే ఫుడ్

Udaan Yatri Cafe: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఎయిర్‌పోర్టుల్లో చౌక ధరలకే ఫుడ్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 30, 2026
03:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం విమాన ప్రయాణికులకు మరో సంతోషకరమైన నిర్ణయం తీసుకుంది. విమానాశ్రయాల్లో అధిక ధరల సమస్యకు చెక్ పెట్టేందుకు ఏర్పాటు చేసిన "ఉడాన్ యాత్రి కేఫ్"లను మరింత విస్తరించింది. ప్రయాణికులకు తక్కువ ధరల్లో నాణ్యమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో ఈ కేఫ్‌లు ప్రారంభించబడిన సంగతి తెలిసిందే. తాజాగా దేశవ్యాప్తంగా మరో 11 విమానాశ్రయాల్లో ఈ సేవలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కేఫ్‌లలో టీ, కాఫీ, సమోసా, వాటర్ బాటిల్ వంటి ఆహార పదార్థాలు కేవలం రూ.10 నుంచే అందుబాటులో ఉండటం విశేషం. విమానాశ్రయాల్లో సాధారణంగా అధిక ధరలు ఉండే నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రయాణికులకు పెద్ద ఉపశమనంగా మారింది.

వివరాలు 

దేశవ్యాప్తంగా విస్తరణ.. మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి

రాజ్‌కోట్ విమానాశ్రయం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి, దేశంలోని 57 విమానాశ్రయాల్లో పలు కొత్త సౌకర్యాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. కొత్తగా ప్రారంభమైన ఉడాన్ యాత్రి కేఫ్‌లలో లక్నో, పాట్నా, రాజ్‌కోట్, జమ్మూ, శ్రీనగర్, జైపూర్, ఇండోర్ వంటి ముఖ్య నగరాలు ఉన్నాయి. ఈ కేఫ్‌లతో పాటు ప్రయాణికుల సౌకర్యం కోసం: డిజి యాత్ర సేవలు ఉచిత వైఫై 'ఫ్లైబ్రరీ' (ఉచిత గ్రంథాలయం) పిల్లల కోసం ప్రత్యేక 'కిడ్స్ జోన్' వంటి సదుపాయాలను కూడా ప్రారంభించారు. అలాగే స్థానిక స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు ప్రోత్సాహం అందించేందుకు 'అవ్సార్ (AVSAR)' ఔట్‌లెట్లు కూడా ఏర్పాటు చేశారు.

వివరాలు 

చౌక ధరలు.. స్థానిక రుచులే ప్రత్యేకత

ఉడాన్ యాత్రి కేఫ్‌లలో ధరలు ప్రయాణికులకు ఎంతో అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా: టీ - రూ.10 వాటర్ బాటిల్ - రూ.10 కాఫీ - రూ.20 స్నాక్స్ - రూ.20 స్వీట్ ఆఫ్ ది డే - రూ.20 అందుబాటులో ఉంటాయి. ఇంకా ప్రత్యేకత ఏమిటంటే, ఆయా ప్రాంతాల స్థానిక రుచులకు ప్రాధాన్యత ఇవ్వడం. ఉదాహరణకు: పుణేలో వడా పావ్ చెన్నైలో వడై కోయంబత్తూరులో మెదు వడ అయితే అన్ని కేఫ్‌లలో సమోసా సాధారణంగా లభిస్తుంది.

Advertisement

వివరాలు 

విజయవంతంగా నడుస్తున్న కేఫ్‌లు

ఇప్పటికే కోల్‌కతా, చెన్నై, పుణే, విజయవాడ, ఇటానగర్, భువనేశ్వర్, సూరత్, అహ్మదాబాద్, ముంబై, మంగళూరు, తిరువనంతపురం, కోయంబత్తూరు విమానాశ్రయాల్లో ఈ కేఫ్‌లు విజయవంతంగా కొనసాగుతున్నాయి. తాజాగా మరో 11 ప్రాంతాల్లో ప్రారంభించడంతో మరింత మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరనుంది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మంత్రి రామ్మోహన్ నాయుడు చేరిన ట్వీట్ 

Advertisement