NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rajasthan: జోదా-అక్బర్‌లకు పెళ్లి కాలేదు.. గవర్నర్ బగాడే సంచలన వ్యాఖ్యలు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Rajasthan: జోదా-అక్బర్‌లకు పెళ్లి కాలేదు.. గవర్నర్ బగాడే సంచలన వ్యాఖ్యలు
    జోదా-అక్బర్‌లకు పెళ్లి కాలేదు.. గవర్నర్ బగాడే సంచలన వ్యాఖ్యలు

    Rajasthan: జోదా-అక్బర్‌లకు పెళ్లి కాలేదు.. గవర్నర్ బగాడే సంచలన వ్యాఖ్యలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 30, 2025
    11:24 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజస్థాన్‌ గవర్నర్‌ హరిభావ్‌ బగాడే చరిత్రలో అక్బర్‌కు సంబంధించిన అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

    బ్రిటిష్‌ చరిత్రకారుల ప్రభావంతో జోధా బాయి, అక్బర్‌ల వివాహం వంటి పలు చారిత్రక ఘటనలు తప్పుడు రీతిలో మన చరిత్రలో నమోదు అయ్యాయన్నది ఆయన అభిప్రాయం.

    రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అక్బర్నామాలో జోధా బాయి - అక్బర్‌ల వివాహం గురించి ఎలాంటి ప్రస్తావన లేదని చెప్పారు.

    అయినా కూడా చరిత్ర పుస్తకాలు, సినిమాల్లో ఈ వివాహం నిజంగా జరిగిందని చూపించారని తెలిపారు. ఇది పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు.

    Details

    దేశ చరిత్రను తారుమారు చేశారు

    రాజ్‌పుత్ పాలకుడు భర్మల్ అనే రాజు ఒక పనిమనిషి కుమార్తెను దత్తత తీసుకుని ఆమెను అక్బర్‌కు ఇచ్చి వివాహం జరిపించారన్న వాదనలను ఆయన ప్రస్తావిస్తూ, దీన్ని నిజంగా నిరూపించలేమన్నారు.

    ఇది 1569లో అమర్ పాలకుడు భర్మల్ కుమార్తె - అక్బర్‌ల వివాహానికి సంబంధించిన చరిత్రపై మళ్లీ చర్చకు దారితీసింది.

    బ్రిటిష్‌ పాలకులు మన దేశ చరిత్రను తారుమారు చేశారని, కొంతమంది భారతీయ రచయితలు కూడా వారి ప్రభావానికి లోనయ్యారని గవర్నర్ బగాడే విమర్శించారు.

    మహారాణా ప్రతాప్‌ - అక్బర్‌ల మధ్య సంధి యత్నాలపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

    Details

    మహారాణా ప్రతాప్ గురించి ఎక్కువ సమాచారం లభ్యం కాలేదు

    మహారాణా ప్రతాప్ అక్బర్‌కు లేఖ రాశాడన్న వాదనను ఖండించారు.

    ఆత్మగౌరవం కోసం మహారాణా ఎప్పుడూ రాజీపడలేదన్నారు. చరిత్రలో అక్బర్ గురించి విస్తృతంగా సమాచారం ఉన్నా, మహారాణా ప్రతాప్‌ గురించి తక్కువగా లభిస్తోందని, ఇది ఇప్పుడు మారుతోందని తెలిపారు.

    నూతన జాతీయ విద్యా విధానంతో మన సంస్కృతిని, చారిత్రక గౌరవాన్ని పరిరక్షించేలా పాఠ్యపుస్తకాలు రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గవర్నర్ హరిభావ్ బగాడే స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజస్థాన్

    తాజా

    Rajasthan: జోదా-అక్బర్‌లకు పెళ్లి కాలేదు.. గవర్నర్ బగాడే సంచలన వ్యాఖ్యలు రాజస్థాన్
    Andhrapradesh: జిల్లాకో 'సోలార్‌ రూఫ్‌ టాప్‌' నమూనా గ్రామం.. పీఎం సూర్యఘర్‌ కింద ఏర్పాటు: సీఎస్‌ ఆంధ్రప్రదేశ్
    Hari Hara VeeraMallu: 'హరి హర వీరమల్లు' నిర్మాత ఆరోగ్యంపై సోదరుడు క్లారిటీ హరిహర వీరమల్లు
    Punjab Firecracker Explosion: బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి, 27 మందికి గాయాలు పంజాబ్

    రాజస్థాన్

    IPL Cricket: ఐపీఎల్ మ్యాచ్: జైపూర్ మ్యాచ్​ లో పిచ్ మధ్యలోకి వచ్చిన కోహ్లీ అభిమాని ముంబై
    Kota Fire: కోట హాస్టల్‌లో భారీ అగ్నిప్రమాదం.. 8 మంది విద్యార్థుకు గాయలు  భారతదేశం
    Rajasthan: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొనడంతో కారులో మంటలు.. స్పాట్‌లో ఏడుగురు మృతి ఉత్తర్‌ప్రదేశ్
    PM Modi: 'కాంగ్రెస్‌ పాలనలో హనుమాన్‌ చాలీసా వినడం కూడా నేరమే...' కాంగ్రెస్ పై విరుచుకుపడ్డ ప్రధాని  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025