Page Loader
Jogulamba Gadwal district: ప్రైవేట్ బస్సులో చెరేగిన మంటలు.. మహిళ సజీవ దహనం 
Jogulamba Gadwal district: ప్రైవేట్ బస్సులో చెరేగిన మంటలు.. మహిళ సజీవ దహనం

Jogulamba Gadwal district: ప్రైవేట్ బస్సులో చెరేగిన మంటలు.. మహిళ సజీవ దహనం 

వ్రాసిన వారు Stalin
Jan 13, 2024
12:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలో శనివారం చిత్తూరు వెళ్లే ప్రైవేట్ బస్సు బోల్తా పడి మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో పడి ఓ మహిళ సజీవదహనమైనట్లు పోలీసులు తెలిపారు. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు జగన్‌ అమెజాన్‌ ట్రావెల్‌ బస్సు హైదరాబాద్‌ నుంచి చిత్తూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. డ్రైవర్ నిద్రమత్తులో బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. అనంతరం బస్సు బోల్తాపడి మంటలు చెలరేగాయని పోలీసులు వెల్లడించారు. బస్సులో మంటలు చెరేగిన వెంటనే ప్రయాణికులు వెంటనే బస్సు దిగారు. కానీ మహిళ చేయి ఇరుక్కుపోవడంతో ఆమె కిందకు దిగలేక సజీవదహనమైంది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన నలుగురిని కర్నూలు ప్రభుత్వాస్పత్రికి చికిత్స కోసం తరలించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కాలిపోతున్న బస్సు