Page Loader
PM Modi invites NDA: ఎన్డీఏ కూటమిలో చేరాల్సిందిగా ఎన్సీపీ, శివసేనలకు మోదీ ఆహ్వానం
ప్రధాని మోదీ

PM Modi invites NDA: ఎన్డీఏ కూటమిలో చేరాల్సిందిగా ఎన్సీపీ, శివసేనలకు మోదీ ఆహ్వానం

వ్రాసిన వారు Stalin
May 11, 2024
02:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎన్సీపీ ​, శివసేన పార్టీలను ఎన్డీఏ కూటమిలో చేరాల్సిందిగా ఆ పార్టీల అధ్యక్షులు శరద్​ పవార్​, ఉద్ధవ్​ ఠాక్రేలను ప్రధాని మోదీ ఆహ్వానించారు. భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీలన్నీ కలసి కూటమిగా రావచ్చని లేదా కాంగ్రెస్​ లో కలసిపోవచ్చని శరద్​ పవర్​ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా మోదీ ఈ ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్​ లో పార్టీలను విలీనం చేసి చనిపోయేకన్నా మీరు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​ నాథ్​ షిండే, అజిత్​ పవార్​ ల వద్దకు వెళితే ఎన్డీఏ చేరేందుకు దారి తెరిచే ఉందని ఈ సందర్భం మోదీ వ్యాఖ్యానించారు.

PM Modi invites NDA

కాంగ్రెస్​ లో విలీనమైతే పూర్తిగా కనుమరుగైపోవడమే...

కాంగ్రెస్​ లో ప్రాంతీయ పార్టీలు విలీనమైతే ఇక ఆ పార్టీలు పూర్తిగా కనుమరగైపోవడమేనని హెచ్చరించారు. నలభై ఏభై ఏళ్లుగా క్రియాశీలక రాజకీయాల్లో పెద్ద నేతగా ఉన్న నేత బారామతి లోక్​ సభ స్థానానికి పోటీ చేసేందుకు ఆపసోపాలు పడుతున్నారని శరద్​ పవార్​ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్​లో ఎన్సీపీని, శివసేనను విలీనం చేయడం వారికి నకిలీ ఆలోచనా విధానానికి అద్దం పడుతుందన్నారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు శరద్ పవార్​ స్పందిస్తూ..ఇటీవల మోదీ తన ప్రసంగాల్లో ప్రజల్లో విద్వేషాన్ని నింపుతున్నారని ఇది దేశానికి ప్రమాదకరమన్నారు. ఇటువంటి భావజాలం ఉన్నవారితో తాను ఇమడలేనని శరద్​ పవార్​ ప్రధాని మోదీ ఆహ్వానాన్ని తిరస్కరించారు.