Page Loader
kaleshwaram judicial commission: కాళేశ్వరం ఎత్తిపోతల్లోని ప్రధాన బ్యారేజీల్లో అవకతవకలు.. 21న రాష్ట్రానికి న్యాయ కమిషన్‌!
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని ప్రధాన బ్యారేజీల్లో అవకతవకలు.. 21న రాష్ట్రానికి న్యాయ కమిషన్‌!

kaleshwaram judicial commission: కాళేశ్వరం ఎత్తిపోతల్లోని ప్రధాన బ్యారేజీల్లో అవకతవకలు.. 21న రాష్ట్రానికి న్యాయ కమిషన్‌!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 14, 2024
01:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాళేశ్వరం ఎత్తిపోతల్లో అవకతవకలు, నష్టాలపై జరుగుతున్న విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కొనసాగుతున్న ఈ విచారణలో, ఈ నెల 21న రాష్ట్రానికి ఆయన రానున్నారు. ప్రధానంగా మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలపై ఆఫిడవిట్లు సమర్పించిన అధికారులను విచారించేందుకు బహిరంగ విచారణ జరుగుతోంది. గతంలో, జూలై 19 నుంచి 28 వరకు విచారణ జరిపిన అనంతరం, జస్టిస్ ఘోష్ 29వ తేదీన కోల్‌కతాకు తిరిగిపోయారు. గత విచారణలో చివరగా, మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లును పిలిచి విచారించారు. అయితే, విచారణను అర్ధాంతరంగా ముగించి, మళ్లీ విచారణను కొనసాగిస్తామని పేర్కొన్నారు.

వివరాలు 

క్వాలిటీ కంట్రోల్‌పై విజిలెన్స్ దృష్టి 

వివిధ అధికారుల విచారణతో పాటు,ఈ నెలలో మరింత వివరమైన విచారణ జరగనుందని సమాచారం. ముఖ్యంగా, ఐఏఎస్‌లు, విశ్రాంత ఐఏఎస్‌లు,నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారణకు పిలిచే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయమై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ తుది నివేదికను సిద్ధం చేయడానికి కృషి చేస్తోంది. ఈ క్రమంలో, నీటిపారుదల శాఖలోని క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్లను విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో) స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ సభ్యులను పిలిచి విచారణ కొనసాగించిందని సమాచారం. క్రితం నివేదికల్లో,క్వాలిటీ కంట్రోల్ విభాగంలో పలు లోపాలు ఉన్నాయని ప్రస్తావించింది.దీంతో,ఈ విచారణలో,ప్రాజెక్టు పూర్తికి సంబంధించి ఇంజినీర్లు,నిర్మాణ సంస్థల మధ్య మార్పిడి అయిన లేఖలపై కూడా విచారణ జరగవచ్చని అంచనా వేస్తున్నారు.