NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్
    తదుపరి వార్తా కథనం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్
    కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్

    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 16, 2025
    05:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా ఉన్న ఆనకట్టలపై జరుగుతున్న విచారణ ప్రక్రియకు జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ముగింపు పలికింది.

    మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్, నిర్మాణ నాణ్యత, నిర్వహణ విధానాలపై గతేడాది నుండి కమిషన్ లోతుగా దర్యాప్తు జరిపింది.

    ఈ దిశగా సాంకేతిక, ఆర్థిక విధానపరమైన అంశాలపై ఇంజినీర్లు, ఉన్నతాధికారులు, సంబంధిత వ్యక్తులను విచారించింది.

    వారి నుంచి అఫిడవిట్లు స్వీకరించి, వాటి ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్‌ను కూడా చేపట్టింది. కాగ్ (CAG), విజిలెన్స్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA) నివేదికలను కమిషన్ జాగ్రత్తగా పరిశీలించింది.

    Details

    ఈ నెల మూడో వారం లోపల ప్రభుత్వానికి నివేదిక

    అన్ని ఆధారాలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకుని తుది నివేదిక తయారుచేసే దశకు చేరుకుంది.

    మొదట్లో గత ప్రభుత్వ నేతలు కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్‌లను విచారణకు పిలవాలనే యోచనలో కమిషన్ ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం లేదనే అభిప్రాయానికి వచ్చిందని సమాచారం.

    జస్టిస్ పీసీ ఘోష్ నివేదికకు తుది మెరుగులు దిద్ది, ఈ నెల మూడో వారం లోపల రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ
    Ponguru Narayana: రెవెన్యూ రికార్డుల అమలు,భూవివాదాల పరిష్కారానికి నక్షా కార్యక్రమం: నారాయణ  ఆంధ్రప్రదేశ్
    Turkey: తుర్కియే సంస్థపై భారత్‌ ప్రతీకారం.. 10శాతానికి పతనమైన సెలెబీ ప్రపంచం

    తెలంగాణ

    TG High Court: భూదాన్ భూముల వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన ఐపీఎస్ అధికారి హైకోర్టు
    TG SSC Result: నేడే తెలంగాణ టెన్త్‌ ఫలితాలు.. మధ్యాహ్నం విడుదల చేయనున్న సీఎం  భారతదేశం
    Telangana: 11.70 లక్షల టన్నుల ధాన్యం సేకరణ.. రైతులకు రూ.817 కోట్లు చెల్లింపు భారతదేశం
    Telangana: రఘునాథపాలెం చరిత్రలో సరికొత్త శకం.. 100 రోజుల్లోనే 'ఎత్తిపోతల' ఫలాలు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025