NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bhupalapalli Murder: కాళేశ్వరం మేడిగడ్డ కేసు న్యాయపోరాటం.. పిటిషనర్ దారుణ హత్య
    తదుపరి వార్తా కథనం
    Bhupalapalli Murder: కాళేశ్వరం మేడిగడ్డ కేసు న్యాయపోరాటం.. పిటిషనర్ దారుణ హత్య
    కాళేశ్వరం మేడిగడ్డ కేసు న్యాయపోరాటం.. పిటిషనర్ దారుణ హత్య

    Bhupalapalli Murder: కాళేశ్వరం మేడిగడ్డ కేసు న్యాయపోరాటం.. పిటిషనర్ దారుణ హత్య

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 20, 2025
    10:32 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భూపాలపల్లి జిల్లాలో బుధవారం రాత్రి ఘోర హత్య సంభవించింది. మేడిగడ్డ కుంగుబాటు వ్యవహారంపై కోర్టులో కేసు వేసిన వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కత్తులు, గొడ్డళ్లతో దారుణంగా హత్య చేశారు.

    మృతుడి పై గతంలో భూ వివాదాలకు సంబంధించిన కేసులు ఉన్నట్లు తెలుస్తోంది.

    2023లో కాళేశ్వరం ప్రాజెక్టు కింద నిర్మించిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తూ ఓ వ్యక్తి కోర్టులో కేసు వేశారు.

    ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావులకు కోర్టు నోటీసులు జారీ చేసింది.

    హత్యకు గురైన రాజలింగమూర్తి (47) భూపాలపల్లికి చెందిన భూ వివాదాల్లో జోక్యం చేసుకునే వ్యక్తిగా పేరొందారు

    Details

    ఆస్పత్రికి చేరుకొనేలోపే మృతి

    బుధవారం రాత్రి సుమారు ఏడున్నర గంటల సమయంలో గుర్తు తెలియని నలుగురైదుగురు దుండగులు మంకీ క్యాప్‌లు ధరించి రాజలింగమూర్తిని చుట్టుముట్టి కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశారు.

    తలకు తీవ్ర గాయాలు కావడంతో పాటు కత్తిపోట్లతో పేగులు బయటకు వచ్చాయి.

    స్థానికులు అతడిని ప్రభుత్వాసుపత్రికి తరలించగా, ఆస్పత్రికి చేరుకునేలోపు మృతి చెందాడు. రాజలింగమూర్తి భార్య గతంలో బీఆర్‌ఎస్‌ తరపున వార్డు కౌన్సిలర్‌గా పనిచేశారు.

    2019 మున్సిపల్ ఎన్నికల్లో భూపాలపల్లి 15వ వార్డు నుండి పోటీ చేసి గెలిచారు. అయితే కొద్ది నెలలకే ఆమెను బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి బహిష్కరించారు.

    Details

    బాధితుడిపై పలు కేసులు నమోదు

    హత్యకు గురైన రాజలింగమూర్తి జంగేడు శివారు పక్కీరుగడ్డలోని ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరై, అక్కడి నుండి ద్విచక్ర వాహనంపై భూపాలపల్లికి తిరిగి వస్తుండగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఎదురుగా రోడ్డును దాటుతుండగా దుండగులు అటకాయించారు.

    రాజలింగమూర్తి రెండు దశాబ్దాలుగా వరంగల్‌ నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది సహాయంతో భూ వివాదాలను పరిష్కరించేవారు.

    ఈ నేపథ్యంలోనే ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి.

    అంతేకాకుండా ఓపెన్ కాస్ట్ గనుల తవ్వకాల వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుందని సింగరేణి సంస్థపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌కు ఫిర్యాదు చేశారు.

    Details

    నిందితులను కఠినంగా శిక్షించాలి

    హత్య అనంతరం రాజలింగమూర్తి భార్య సరళ, కుటుంబ సభ్యులు భూపాలపల్లిలోని అంబేడ్కర్ కూడలిలో జాతీయ రహదారిపై బైఠాయించి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి, మాజీ సర్పంచి బుర్ర చంద్రయ్య, వార్డు మాజీ కౌన్సిలర్ కొత్త హరిబాబులే హత్యకు కారణమని ఆరోపించారు.

    వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

    ఇదే విషయమై భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హత్యకు గల అసలు కారణాలు తెలియాల్సి ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీఆర్ఎస్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    బీఆర్ఎస్

    Minister Sathyavathi Rathod : మంగళహారతి పల్లెంలో డబ్బులు పెట్టారు..పోలీసులు కేసు పెట్టారు ప్రభుత్వం
    BRS: బీఆర్ఎస్‌లో చేరిన  ఆందోల్ బీజేపీ అభ్యర్థి బాబు మోహన్‌ కుమారుడు బీజేపీ
    Alampur : అలంపూర్ లో బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లో చేరిన ఎమ్యెల్యే  కాంగ్రెస్
    CM KCR: రెచ్చగొట్టే వ్యాఖ్యలపై.. కేసీఆర్‌కు ఈసీ నోటీసులు జారీ  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025